ఆంధ్రప్రదేశ్
అట్టహాసంగా అఖిలభారత రెడ్ల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశం : ముఖ్యఅతిథిగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల పట్టణంలో ఆదివారం రాజారెడ్డి ఫంక్షన్ హాల్ నందు అట్టహాసంగా అఖిలభారత రెడ్ల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశం నిర్వహించి జ్యోతి ప్రజ్వలతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్లందరూ ఐకమత్యంగానే ఉన్నారని ఆనాడు నీలం సంజీవరెడ్డి ఐక్యతతో నంద్యాలలో రెడ్లందరూ కలిసి గెలిపించుకోవడం జరిగిందని, అదే ఐక్యత ప్రతి ఒక్కరిలో రావాలని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన పోరాటం మొదట మహమ్మదీయులపై దండయాత్ర చేసి గెలుపొంది తర్వాత ఆంగ్లంలో పోరాడి వీర మరణం పొందాడని తెలిపారు. చత్రపతి శివాజీ 300 సంవత్సరాలు ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దండయాత్ర చేసి విజయాలు సాధించాలని తెలిపారు. ముఖ్యంగా రెడ్లకు దానగుణంలో మంచితనం రెడ్లకే ఉందని ఆయన అన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక గ్రామ సభలో దళితుల అమ్మాయి సభ ముందు రావడంతో అమ్మాయి ఎవరు అని వాకబు చేయడంతో గ్రామ పెద్దలందరూ దళిత అమ్మాయిని చెప్పడంతో అమ్మాయిని నేను ఇంటికి తీసుకు వెళ్లి డాక్టర్ కు చూపించి వైద్య చికిత్సలు అందించి అన్ని సపరియలు చేసి అమ్మాయికి అవసరమైనటువంటి విద్య ఉద్యోగం కల్పించడం జరిగిందని తెలిపారు. బెంగళూరు నందు సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం నిర్వహిస్తుందని ఆ అమ్మాయికి వచ్చే నెలలో వివాహం జరగనిందని ఆయన తెలిపారు. ఇటువంటి విషయాలు ఒక రెడ్లు మాత్రమే చేయగలరని ఆయన గర్వంగా చెప్పారు. అనంతరం కడప రెడ్డి సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో మనమందరం ముందుకు సాగాలని వైద్య విద్య అందరికీ సహాయం అందించాలని రెడ్డి కులంలో కూడా పేదవారు ఉన్నారని వారందరికీ మనం సహాయం చేస్తూ ఎదగాలని తెలిపారు. చిత్తూరు జిల్లా రెడ్డి సంఘం నాయకులు చెంచురెడ్డి మాట్లాడుతూ రెడ్లకు ఏ గవర్నమెంట్ సహాయ సహకారాలు అందించడం లేదని ఎందుకంటే వేరే కులాలు ఎక్కడ దూరమైతావని ఆలోచన ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయని భయంతో రెడ్డి కులాలకు సహకారం అందించడం లేదని తెలిపారు. ప్రస్తుతం నేను ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతూ ఇండస్ట్రియల్ రన్ చేస్తున్నానని పదిమందికి సహాయ సహకారాలు అందజేస్తున్నారని తెలిపారు. కాశిపురం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్లందరూ ఐకమత్యంగా ఉండాలని తెలుపుతూ ఇప్పటికీ తమిళనాడులో స్థిరపడిన రెడ్డి వంశస్థులు రెడ్డి అనే పేరు చెప్పుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారని మన సంస్కృతి గొప్పది ప్రతి రాష్ట్రంలో తెలియాలని తెలిపారు. అనంతరం సుమతి రెడ్డి భక్త మల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మాట్లాడుతూ రెడ్డి జాతి అంటే ఒళ్లంతా జలదరిస్తుందని వందల కోట్ల మంది రెడ్డి జాతిని కీర్తిస్తున్నారని తెలిపారు. ప్రపంచమంతా గర్వించే జాతి రెడ్డి జాతిని గర్వంగా ఉందని తెలిపారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పదిమంది రెడ్డి జాతి కులాలను అభివృద్ధిలోకి తీసుకురావాలని నంద్యాలలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కులానికినేనున్నానని ముందుకు రావడం సంతోషకరమని మంచి ఉద్దేశమని తెలిపారు. రెడ్డి కులంలో కూడా చాలామంది పేదవారు ఉన్నారని చదువుకునే ఆడపిల్లల అందరికీ రెడ్డి హాస్టల్ లో ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే పేద రెడ్డి వర్గాలకు సంక్షేమం అందించాలని తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక