ఆంధ్రప్రదేశ్
పేద ప్రజల జీవితాలలో వెలుగు నింపిన గొప్ప నాయకుడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.
దివంగత మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహం నందు ఎమ్మెల్సీ ఇస్సాక్ భాషా ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ బాబున్నీసా మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్ లు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు డాక్టర్ వైఎస్ఆర్ నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహానేత స్ఫూర్తితో ముందుకు నడవాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆ మహానేత మనందరిని విడిచి వెళ్లిపోయి 15 సంవత్సరాలు గడిచాయంటే ఎంతో బాధగా ఉందని అన్నారు. డాక్టర్ వైయస్సార్ పేద ప్రజలకు ఉపయోగకరమైన సంక్షేమ పథకాలలో ఆరోగ్యశ్రీ, 104, 108, జలయజ్ఞం వంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. అలాగే ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి మైనార్టీల జీవితాలకు ఊతమిచ్చారని గుర్తు చేశారు. ఇటువంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందారని , డాక్టర్ వైయస్సార్ కు మరణం లేని మహానేత అన్నారు. డాక్టర్ వైయస్సార్ ను రాజకీయ మార్గదర్శకుడిగా తీసుకోవాలని, వారి స్ఫూర్తి ఆదర్శాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా మాట్లాడుతూ మహానేత పెద్దాయన వర్ధంతి పురస్కరించుకొని వారికి ఘన నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డా . వైయస్సార్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పేదల గుండెల్లో స్థానాన్ని సంపాదించారని తెలిపారు. మహానేత ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్లు చంద్రశేఖర్, డా.శశికళ రెడ్డి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఏపీ స్టేట్ జనరల్ సెక్రెటరీ దాల్ మిల్ అమీర్ , మున్సిపల్ వైస్ చైర్మన్ లు గంగిశెట్టి శ్రీధర్ ,పామ్ షావలి, మాజీ మున్సిపల్ చైర్మన్ కైప రాముడు, వైసిపి నాయకులు దేశం సుధాకర్ రెడ్డి ,ముస్లిం జేఏసీ నాయకులు, వైసిపి కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్, వార్డు ఇన్చార్జిలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక