Connect with us

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వలన సంభవించిన నష్టనివారణకు యుద్ధప్రతిపాదిక చర్యలు చేపట్టాలి. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె.నాగరాజు డిమాండ్

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో, కర్నూలు సిటి

రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన ఊర్లు ఏర్లు అన్ని ఏకమై వేలాది గ్రామాలు జలదిగ్బంధనానికి గురైందన్నారు.సోమవారంనాడు సీపీఐ(ఎంఎల్ )న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి కె.నాగరాజు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కె.నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటల్లోనే 28.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదయిందన్నారు. ఇప్పటికి వరకు అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం 15 మంది వరదల్లో చిక్కుకొని మృతి చెందారు. అనేకమంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా తెలియ రావడం లేదు. రోడ్లు, రైల్వే లైన్లు ధ్వంసమై రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రైళ్లు బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారుని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ వర్ష బీభత్సం వలన వ్యవసాయ రంగం కుదేలైంది. రాష్ట్రంలో భారీ పంట నష్టం సంభవించింది పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి ,రాష్ట్రవ్యాప్తంగా చెరువులు తెగిపోయాయి.వేలాది ఎకరాల పంటభూములు కోతకు గురవటంతో పాటు పొలాల్లో ఇసుక మేటలు పెట్టి సేద్యానికి పనికి రాకుండా పోయాయన్నారు. ప్రధానంగా గుంటూరు, బాపట్ల, ప్రకాశం, విజయవాడ, కృష్ణ జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ,లాంటి జిల్లాల్లో భారీగా పంట నష్టం సంభవించింది. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని ప్రకృతి విపత్తుగా పరిగణించి యుద్ధ ప్రాతిపదికపై సహాయక చర్యలు చేపట్టాలని ,ఇతర ప్రాంతాల ప్రజలు నీట మునుగిన ప్రాంతాలకు తిండి , బట్టలు ,సురక్షితమైన ప్రాంతాలకుచెర్చడం కోసం కృషి చెయ్యాలని , ఆర్థికంగా ఆదుకుని సహాయం అందచేసి మానవత్వం చాటుకోవాలి అని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ పార్టీ ప్రజలను కోరుతున్నది.
డిమాండ్స్
🔸కర్నూలు జిల్లాలో అకాల వర్షాలు కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి,ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి.కర్నూలు జిల్లాలో విష జ్వరాలు ప్రబలకుండా సహాయక చర్యలు చేపట్టి,ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అత్యవసర వైద్యవిభాగాన్ని అందరికి అందుబాటులో ఉంచాలి.
🔸 వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 50 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలి.పశువులు, కోళ్లు కోల్పోయిన వారి నష్టానికి తగిన పరిహారం అందించి ఆదుకోవాలి.
🔸తెగిపోయిన చెరువులు కుంటలను గండ్లు పడిన కాలువలను వెంటనే మరమ్మతులు చేయించాలి.
🔸నష్టపోయిన పంటల వివరాలను రికార్డు చేసి తగిన నష్టపరిహారాన్ని అందించాలి.
🔸వరద కోతకుగురైన,ఇసుక మేటలు వేసిన భూములు సాగులోకి తెచ్చుకొనేందుకు ఆర్థిక సహకారం అందించాలి.
🔸 రాష్ట్రంలో తక్షణమే పంటల బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురావాలి.
🔸 ఇంకా వర్షం ఉండడంతో వరదలను నివారించేందుకు ముందస్తుగానే తగిన సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
..
కె.నాగరాజు
సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580594
Total Users : 48278