ఆంధ్రప్రదేశ్
ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల పట్టణంలోని స్థానిక పార్క్ రోడ్డు లో గల బాల అకాడమీ మరియు రవీంద్ర విద్యాసంస్థలు అధినేత రవీంద్ర , మాధవిలత ఆధ్వర్యంలో స్థానిక ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది .
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలని, ముఖ్య ఉద్దేశంతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు . మత సామరస్యానికి ప్రతీకగా వినాయక చవితి నిర్వహించుకుంటారని ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజు వినాయకుని పూజిస్తారని కావున దయచేసి అందరూ మట్టి వినాయకుని విగ్రహాలనే వాడాలని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఒకటవ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి , పల్లె వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక