ఆంధ్రప్రదేశ్
93 పరిశ్రమల యూనిట్లకు 8.43 కోట్ల సబ్సిడీ మంజూరు

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
పరిశ్రమల అభివృద్ధికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి.
జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.
జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించే నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పరిశ్రమల మేనేజర్ శ్రీనివాస యాదవ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, ఎస్సీ ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ రాజమహేంద్రనాథ్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామిక రంగ అభివృద్ధికి సంబంధిత అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి నూతన పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లా ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో 93 పరిశ్రమల యూనిట్లకు 8.43 కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తాన్ని మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరిశ్రమలు స్థాపించే ఎంటర్ప్రీనర్స్ కు సంబంధించి పెండింగులో వున్న 8 యూనిట్లను పరిశీలించి మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, స్టాండ్ అప్ ఇండియా కింద నిర్దేశించిన 66 యూనిట్ల లక్ష్యం మేర యూనిట్ల నెలకొల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి బ్యాంకులకు పంపిన 119 దరఖాస్తులలో 21 యూనిట్లు మంజూరు చేసినట్లు లీడ్ డిస్టిక్ మేనేజర్ జిల్లా కలెక్టర్ నివేదించగా అందరినీ సమన్వయం చేసుకొని నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎమ్ఎస్ఎమ్ఈ యూనిట్ల స్థాపన కొరకు స్వీకరించిన దరఖాస్తులను నిర్దేశిత గడువు లోపు పరిష్కరించే విధంగా బ్యాంక్ అధికారులకి ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎగుమతులకు సంబంధించి సంస్థ లేకపోవడం వల్ల జిల్లా రెవెన్యూ అంతా కృష్ణపట్నం పోర్టుకు వెళుతుందని ఈ ప్రాంతంలో సంబంధిత సంస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజామహేంద్రనాథ్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఎస్సీ, ఎస్టీల కొరకు ప్రత్యేక ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరారు. అర్బన్ డెవలప్మెంట్ చార్జెస్ (ల్యాండ్ కన్వర్షన్, రెవెన్యూ) లో ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ లకు వంద శాతం రియంబర్స్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ లకు సంబంధించి నూతన పరిశ్రమల ఏర్పాటులో విద్యుత్ ఇన్స్టాలేషన్ చార్జెస్ (ట్రాన్స్ఫార్మర్స్) భారంగా ఉన్నాయని వాటి తొలగింపుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. ఎంఎస్ఎంఈ రంగంలో రుణాల మంజూరు కొరకు ప్రత్యేకమైన దినాన్ని కేటాయించవలసిందిగా కమిటీ సభ్యులు కలెక్టర్ ను కోరారు. ఈ సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అధ్యక్షుడు రామలింగారెడ్డి, భూగర్భ జల శాఖ డిడి రఘురాం, ఆర్టీవో శివారెడ్డి, డిపిఓ మంజులవాణి తదితర అధికారులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక