ఆంధ్రప్రదేశ్
మొదటి వినాయకుని నిమజ్జనం చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.

సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలను ప్రజలు ఏర్పాటు చేశారు. బుధవారం వినాయక పండగ ఐదవ రోజు కావడంతో నిమజ్జనానికి సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల స్థానిక చిన్న చెరువు నందు మొదటి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నిమర్జనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ డప్పులు, మేళ తాళాలు, రంగులు, బాణాసంచా, గణపతి పప్పా మోరియా అంటూ నిమజ్జనానికి పయనమయ్యారని అన్నారు. నంద్యాల చిన్న చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనానికి పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారన్నారు . ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చెరువు కట్ట వెంబడి బారీకేడ్లు ఏర్పాటు చేశారు . వినాయక విగ్రహాలను ప్రజలు వాహనాలలో చెరువు కట్ట వద్దకు తీసుకువచ్చి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారన్నారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ భాషా , మున్సిపల్ చైర్ పర్సన్ మాబునిషా , టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్ర రావు , రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి , గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు గంగిశెట్టి విజయ్ కుమార్ , కౌన్సిలర్లు గంగిశెట్టి శ్రీధర్ , శ్యామ్ సుందర్ లాల్ , ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెలం బాబు , నిమ్మకాయల సుధాకర్ , మేడ మురళి , శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక