ఆంధ్రప్రదేశ్
గిరిజనులకు పెన్షన్లు మంజూరు చేయాలి : సిపిఎం డిమాండ్

నంద్యాల జిల్లా,
రుద్రవరం.
ఏపీ టుడే న్యూస్ రిపోర్టర్ :
సిపిఎం పార్టీ కోటకొండ కొత్తూరు శాఖ మహాసభ చిన్నయ్య స్వామి చెంచుగూడెం లో జరిగినది. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి సిపిఎం నాయకులు టి. రామచంద్రుడు మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాల క్రితం ఎలాంటి స్థిర నివాసం లేక, రైతుల పొలాల్లో కాపురం సాగిస్తున్న గిరిజనులంతా ఎర్ర జెండా కింద ఐక్యంగా పోరాడి గిరిజనగూడాన్ని ఏర్పాటు చేసుకున్నారని, 55 చెంచు కుటుంబాలు గూడెం లో నివసిస్తున్నారని, ఆనాడు 30 కుటుంబాలకు ఇండ్ల పట్టాలు, 22 కుటుంబాలకు సాగు భూములు మంజూరు చేశారని, నేటికీ గూడెంలో 55 కుటుంబాలు అయ్యాయి. కావున రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన గిరిజనులందరికి ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, ప్రభుత్వం పంచిన 23 ఎకరాల సాగు భూమి తెలుగు గంగ ప్రధాన కాలువకు పై భాగాన నల్లమల ఫారెస్ట్ ఆనుకొని ఉండటంవల్ల సాగునీటికి నోచుకోవడం లేదని, ఆరో కొర వర్షాల వల్ల పండిన పంటకు అడవి జంతువులు వల్ల తీవ్రంగా పంట నష్టం జరుగుతున్నది. కావున ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన భూముల్లో సాగు నీటి బోరు వేయాలని, అడవి పందుల బెడద నుండి వారి పంటను కాపాడడం కోసం ఫారెస్ట్ వెంట కంచ వేయాలని, నేటికీ భూమి లేని గిరిజనులందరికి సాగుభూమి ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని, వృద్ధులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు మంజూరు చేయాలని, అడవి ద్వారా తేనె, జిగురు, కుంకుడు కాయలు లాంటి అటవీ ఉత్పత్తులు సేకరించుకొని అమ్ముకోవడం కోసం గిరిజనులకు ఉపాధి అవకాశం కల్పించి గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం గిరిజనులంతా ఐక్యమత్యంగా ఉండాలని కోరారు. సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా రైతులు, కూలీలు, కార్మికుల హక్కుల కోసం గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు మొదలగు తరగతుల ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై ప్రణాళిక బద్ధంగా, సూత్రబద్ధ వైఖరితో పోరాటాలు చేస్తుందని, అందులో భాగంగానే మూడు సంవత్సరాలకొకసారి గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తమ శాఖ మహాసభలను జరుపుకొని, గత కార్యక్రమాలు సమీక్షించుకుని భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటుందని, అందులో భాగంగానే తమ శాఖ మహాసభలు జరుపుతున్నామని తెలిపారు. అనంతరం శాఖ కార్యదర్శిగా సౌరం హనుమంతు, సహాయ కార్యదర్శిగా బత్తుల శ్రీనివాసులు తో పాటు, పోలిరెడ్డి అజయ్ తో పాటు 18 మందితో పార్టీ శాఖను ఎన్నుకున్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక