ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను విజయవంతం చేయండి. క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ఈనెల 17 నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం, పిజిఆర్ఎస్, డివార్మింగ్ డే తదితర అజెండా అంశాలపై ఆర్డీవోలు, తాసిల్దారులు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఈనెల 17 నుండి అక్టోబర్ 1 తేదీ వరకు 15 రోజులపాటు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పరిశుభ్రత కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల ఉద్యోగస్తులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి పాల్గొనేలా చూడాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారము స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు జరగాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులచే దేవాలయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పర్యాటక ప్రదేశాలు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పారిశుద్ధ కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా 74 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు సరఫరా చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఆరోగ్య భీమా కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో డయేరియా కేసులు నమోదు కాకుండా ఎప్పటికప్పుడు ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులు శుభ్రపరచడంతో పాటు క్లోరినేట్ చేసిన సురక్షిత మంచినీటినే సరఫరా చేయాలని సంబందిత అధికారులను సూచించారు. ఇ- క్లీనింగ్ లో భాగంగా మొబైల్ డేటా తో పాటు చెడిపోయిన సెల్ ఫోన్స్ ,టీవీలు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటిని ఈ వేస్ట్ కింద క్లియర్ చేయాలన్నారు. పారిశుధ్య కార్మికులకు సానిటేషన్ పరికరాలు, వస్తువులతో పాటు గ్లౌజులు, మాస్క్ లు తదితర సురక్షిత వస్తువులను గ్రామ పంచాయితీలలోని 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి కొనుగోలు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పిజిఆర్ఎస్ నందు స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన రీతిలో ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. ప్రతిరోజు పిజిఆర్ఎస్ లాగిన్ అయి ఉన్న సమస్యలను పరిశీలించి, అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులతో మాట్లాడకుండా అతనికి తెలియకుండా సమస్యను క్లోజ్ చేయరాదన్నారు. అర్జీలను ఆడిట్ చేసేందుకు కలెక్టరేట్ నందు ప్రత్యేకంగా ఆడిటింగ్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. అర్జీలకు సరైన సమాధానం ఇవ్వని అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఏ ఒక్క అర్జీ కూడా రీఓపెన్ కాకుండా అర్జీదారులతో మాట్లాడి వారికి సరైన సమాధానాలు తెలియజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయ నులి పురుగుల దినోత్సవంలో భాగంగా 1- 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్లను మింగించాలన్నారు. ఈ నెల 17న మిస్సయిన వాళ్లకు ప్రతికంగా ఈనెల 25వ తేదీన ఇవ్వాలన్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలకు టాబ్లెట్లు ఇచ్చి సంబంధిత మెడికల్ బృందాలు అక్కడే ఉండి పిల్లలను పరిశీలించాలన్నారు.
జిల్లాలో లక్ష కుటుంబాలకు వంద రోజుల పని దినాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. గృహ నిర్మాణాల పురోగతికి సంబంధించి హౌసింగ్ మ్యాన్డేట్స్ కల్పిస్తే వేతన రేట్ పెరిగి జిల్లాకు అదనపు మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అన్ని పారామీటర్లలో జీరో శాతం ప్రగతి కనబడుతుందని రాష్ట్రంలో నంద్యాల జిల్లా దిగివ స్థానంలో ఉందన్నారు. చివరి క్వార్టర్లో అంగన్వాడీలు, ఆరోగ్య కర్తల సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే నాలుగు మాతృ మరణాలు సంభవించాయన్నారు. పెండింగ్ లో ఉన్న 60 వేల ఎకరాల ఈ పంట, రెండు లక్షల రైతుల ఈ కేవైసీ పూర్తి చేసేందుకు ఆర్డీవోలు, వ్యవసాయ అధికారులు, తాసిల్దారులు, వీఆర్వోలు, ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ మంజులవాణి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక