ఆంధ్రప్రదేశ్
మంత్రాలయంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జ్ నల్లగౌని విష్ణువర్ధన్ రెడ్డి
ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 74 వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు అభినందనలు వెళ్లవెత్తుతున్నాయి. దేశం మొత్తం కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే, అందులో భాగంగానే మంత్రాలయం మండల ఎంపీడీవో మని మంజరి ఆధ్వర్యంలో మంత్రాలయంలోని స్థానిక రాఘవేంద్ర సర్కిల్ నందు మంగళవారం రోజున స్వచ్చతా హి సేవ అనే కార్యక్రమం ఈఓఆర్డి ప్రభావతి ఎంపీపీ పులుకుక్క రాఘవేంద్ర ఎంపీటీసీ వెంకటేష్ వ్యవసాయ సలహా మండలి సభ్యులు కురువ మల్లికార్జున పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జ్ నల్లగౌని విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మంత్రాలయంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవాలని మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగా ఉంటుందని అన్నారు.మంత్రాలయం ప్రజలు ప్లాస్టిక్ కవర్లు ,పదార్థాలు వాడడం తగ్గించాలని ఆయన తెలియజేశారు.నరేంద్ర మోడీ తెచ్చిన స్వచ్ఛభారత్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మన దేశ పురోగతి భారీ స్థాయిలో పెరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. పది రోజులు పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక వృద్ధాశ్రమానికి వెళ్లి మోడీ పుట్టినరోజు సందర్భంగా పాలు, పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు వృద్ధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం కో కన్వీనర్ చిరుతపల్లి ఈరన్న, మంత్రాలయం బిజెపి సీనియర్ నాయకులు రాఘవేంద్ర కులకర్ణి , మంత్రాలయం నాయకులు బంగారయ్య, పెద్దకడబూరు మండలం అధ్యక్షుడు పురుషోత్తం గౌడ్ , కౌతాళం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక