ఆంధ్రప్రదేశ్
జాతీయ నులిపురుగుల దినాన్ని విజయవంతం చేయండి : పిడి రామచంద్రారెడ్డి

నంద్యాల జిల్లా- సిరివెళ్ళ- ఉల్లి గుర్రప్ప,
ఏపీ టుడే. న్యూస్:
మంగళవారం నాడు స్థానిక మండల పరిధిలోని గోవిందపల్లి గ్రామంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం కార్యక్రమంలో :పిడి రామచంద్రారెడ్డి డిఈఓ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సిరివెళ్ల ఆరోగ్య కేంద్ర పరిధిలో
29 పాఠశాలలో 5628 మంది విద్యార్థులకు ఆల్బెండ జోల్ మాత్రలు వేయిస్తున్నట్లు తెలిపారు తదనంతరము సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి నులి పురుగుల నివారణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు
పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నామని ఒకటి నుండి రెండు సంవత్సరాల పిల్లలకు అర్థమాత్ర మరియు రెండు
నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర వేయాలని తెలిపారు. 19 సంవత్సరాల లోపల పిల్లలకు సాధారణంగా వ్యాధినిరోధక శక్తి స్థాయిలు పెద్దవారి కంటే తక్కువ ఉండటం వలన త్వరగా పిల్లలు నులిపురుగుల బారిన పడతారని తెలిపారు. చిన్నపిల్లలు మట్టిలో ఆడుకుని చేతులు శుభ్రంగా
చేసుకోకుండా తినడం వల్ల నోటి ద్వారా పొట్ట మరియు పేగుల్లో నులిపురుగులు ప్రవేశించి అనారోగ్యాన్ని కలగజేస్తాయని తెలిపారు మన దేశంలో 65% మంది తరచుగా నులిపురుగుల బారిన పడుతున్నారని తెలిపారు ఇది మట్టి ద్వారా వ్యాపించే వ్యాధి అని అపరిశుభ్ర పరిసరాలు చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోవడం, ఆరు బయట మలవిసర్జన చేయడం ,కలుషితమైన ఆహారము నీటిని తీసుకోవడం వలన నులిపురుగుల బారిన పడతారని తెలిపారు. పిల్లలకు శరీరానికి బయటి నుండి అందించిన పోషకాలు అన్నిటిని పిల్లల కడుపులో ఉన్న నులి పురుగులే తినేస్తాయనీ అందువలన పిల్లలు పోషకాహార లోపానికి రక్తహీనతకు గురవుతారని వీటి నివారణకు సరైన మందులు ఆల్బెండ జోల్ మాత్రలు అందుబాటులో ఉన్నాయని ఏడాదికి రెండుసార్లు ఆల్బెండజోళ్ మాత్రలు ఇప్పిస్తే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుందని, కాబట్టి పిల్లలందరూ ఈ కార్యక్రమంలో ఆల్బెండజోల్ తీసుకొని
ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు మరియు మురళి నూలి.పురుగులు సోకిన విద్యార్థులలో ఆకలి మందగించడం ,నీరసం, ఆందోళన కడుపునొప్పి, వికారం ,వాంతులు,
విరోచనాలు బరువు తగ్గడం, ఏకాగ్రత లోపం, శరీరంపై ఎర్రటి పురుగుల ఆకారంలో దద్దుర్లు, జ్వరం ,తలనొప్పి మొదలైన లక్షణాలు తరచుగా కనిపిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎండిఓ సుబ్రహ్మణ్యం ,ఈ ఓఆర్ డి నాగేంద్రుడు, ఎంఈఓ రఘురామిరెడ్డి, నాగార్జున రెడ్డి ,శంకర ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు బాలనాగిరెడ్డి పీహెచ్ ఎన్ సరస్వతి ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక