ఆంధ్రప్రదేశ్
వరద బాధితులకు అండగా 21.80 లక్షల చెక్కును అందచేసిన…… మంత్రాలయం టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి

వరద బాధితులకు అండగా 21.80 లక్షల చెక్కును అందచేసిన…… మంత్రాలయం టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి ….
ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్:
ఇటీవల కాలంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం ఒక్కసారిగా స్తంభించబోయిన విషయం అందరికీ తెలిసిందే, అయితే అసలే అప్పులతో కూరుకుపోయినా రాష్ట్రంలో ఇలాంటి అనుకోని విపత్తు సంభవించినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చోరవతో వరద బాధితులకు ప్రభుత్వం తన శక్తి మేర అన్ని రకాల సహాయ సహాకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాత్రింబవళ్లు తేడా లేకుండా వరద బాధితులను ఆదుకోవడానికి ఆయన చేసిన కృషి వర్ణనాతీతం. రాష్ట్ర లోటు బడ్జెట్ దృష్ట్యా పూర్తిస్థాయిలో వరద బాధితులను ఆదుకోలేక పోయినప్పటికి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు వరద బాధితులకు అందించాలని రాష్ట్ర ప్రజలకు ఆయన ఇచ్చిన పిలుపుమేరకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే విజయవాడ సహా పలు ప్రాంతాల్లో వచ్చిన వరదలకు తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు మంత్రాలయం నియోజకవర్గం ప్రజలు అందజేసిన ఇరవై ఒక లక్షల యనభై వేల రూపాయల (21.80లక్షలు) చెక్కును బుధవారం రోజున ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరియు మంత్రి నారా లోకేష్ కి మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి అందజేసి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కౌతాళం మండల నాయకులు చూడి ఉలిగయ్య ,వెంకటపతి రాజుగారు.కోసిగి మండల నాయకులు ముత్తురెడ్డి గారు పల్లెపాడు రామిరెడ్డి గారు, తోవి రామకృష్ణ , జ్ఞానేష్ గారు , నాడిగినేని అయ్యన్న గారు,వక్రని వెంకటేష్ గారు. పెద్దకడుబుర్ మండల నాయకులు నరవ రమాకాంత్ రెడ్డి, బసలదొడ్డి ఈరన్న గారు.మంత్రాలయం మండల నాయకులు అశోక్ రెడ్డి గారు, వరద రాజు గారు మరియు నాలుగు మండలల నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు .
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక