ఆంధ్రప్రదేశ్
“ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ.
టిడిపి ది పేదల ప్రభుత్వం , మాది జవాబు దారి ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.
టీడీపీ ది పేదల సంక్షేమ ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల నూనెపల్లె వాటర్ ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాని ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నంద్యాల నియోజకవర్గం నూనెపల్లె వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి మంత్రి ఫరూక్ శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లు రూ.3000 నుంచి ఒకే సారి రూ.4000 లకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచి అత్యంత సాహోపేతమైన నిర్ణయం తీసుకున్నారనీ పేర్కొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కల్పించారన్నారు . ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1న జీతాలు చెల్లింపు కార్యక్రమం చేపట్టారని విజయవాడలో వరద బాధితులను కంటికి రెప్పలా 10 రోజుల పాటు బస్సులో ఉండి ఓ తండ్రిలా ప్రజల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. నిరుద్యోగ యువతీ యువకులకు అండగా 16 వేల 437 మందికి ఉద్యోగాలు కల్పించడానికి టీడీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నీ ప్రకటించడం హర్షించదగ్గ శుభ పరిణామం అన్నారు. పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అన్న క్యాంటీన్ ద్వారా రూ.5 లకే కడుపు నిండా నాణ్యమైన భోజనం అందించే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ లకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు . పంచాయతీలకు రూ. 1452 కోట్లు మంజూరు చేసి పంచాయతీలకు ప్రాణం పోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రన్న కూటమి ప్రభుత్వం అన్నారు .అదే విధంగా నంద్యాల నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పారు. గ్రామానికి శ్మశానం , త్రాగునీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జగన్ పాలనలో ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితి.
జగన్ పాలనలో అన్ని రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి గత ఐదేళ్ల లో సాగిందని అన్నారు. జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ఆస్తులను కొట్టేయాలని ప్లాన్ వేశాడని. అది ఎన్నికల్లో పూర్తిగా బెడిసి కొట్టి ప్రజలు వైసిపి నీ తరిమి కొట్టారన్నారు . చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ యాక్ట్ రద్దు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా విజయవాడ వరద బాధితులను ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , స్పెషల్ ఆఫీసర్ (పిడి) , మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీదేవి , జైనాబి , నాగార్జున , మాజీ కౌన్సిలర్లు వాకా శివ శంకర్ యాదవ్ , కృపాకర్ , వాకా వరప్రసాద్ యాదవ్ , మంజుల సుబ్బరాయుడు , గుద్దేటి వెంకటేశ్వర్లు , కొట్టాల శివ నాగిరెడ్డి , నూనెపల్లె జెపి , బ్యాంకు తిమ్మయ్య , వడ్డె జనార్ధన్ , షేక్ మున్నా , సాయిరాం , జోసెఫ్ , సంపంగి రామకృష్ణ , విజయ గౌరీ , నాగ రత్నమ్మ , సుంకన్న , రవి , భారతి మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక