ఆంధ్రప్రదేశ్
ప్రజల మధ్య ప్రభుత్వం 100 రోజుల పండుగ చేసుకుంటుంది. రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందిస్తున్నాం.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం కోవెలకుంట్ల మండలం గులదుర్తి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం – ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గ్రామ సర్పంచు, తాసిల్దారు, ఎంపీడీఓ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలోని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే డోన్ నియోజకవర్గం బేతంచెర్ల మండలం రహిమాన్ పురం గ్రామంలో కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం మండ్లెo గ్రామంలో గిత్త జయ సూర్య ఇది మంచి ప్రభుత్వం – ప్రజావేదిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజలందరికీ న్యాయం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వందరోజుల పండుగను ప్రజల మధ్య జరుపుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే మే నెలలో పెంచిన పెన్షన్ మొత్తాన్ని బకాయిలతో కలిపి మొదటి నెల ప్రతి ఇంటికి వెళ్లి 7వేల రూపాయల పెన్షన్ ను అందజేశామన్నారు. గత ప్రభుత్వం కంతుల వారీగా చెల్లించిన రీతిలో కాకుండా రెండవ నెల పెంచిన రు.1000 కలిపి మొత్తం 4000 రూపాయల పెన్షన్ అందజేశామన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెగా డీఎస్సీ ద్వారా 16,437 మందికి పోస్టుల భర్తీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. పేద ప్రజల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లను పునరుద్ధరించామన్నారు. త్వరలో బనగానపల్లి నియోజకవర్గంలో కూడా అన్న క్యాంటీన్ల ప్రారంభానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే రాళ్లపై గత ప్రభుత్వ నాయకుల ఫోటోలను తొలగించి ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా కల్పిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని మంత్రి వివరించారు. భూ తగాదా సమస్యలను ప్రజలు రెవెన్యూ సదస్సులో పరిష్కరించుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై ప్రతి సోమవారము అర్జీల రూపంలో వినతులు స్వీకరించి ప్రాధాన్యత క్రమంలో నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రజా వేదికలో భూసార పరీక్షల నిర్వహణపై పలువురు రైతులు మంత్రిని కోరగా పరీక్షలకు సంబంధించి అగ్రికల్చర్ టెస్టింగ్ ప్రయోగశాలలో పరికరాల ఏర్పాటుకు 10 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా రైతులకు వివరించారు. గులదుర్తి గ్రామంలో వ్యవసాయ బోర్లకు విద్యుత్ అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామంలో సమస్యలపై లేవనెత్తిన అంశాలపై మంత్రి ప్రస్తావిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా కాలువలో కూడిక తీయడం, పారిశుద్ధ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టడం, రహదారుల గుంతలను పూడ్చడం తదితర ప్రజా అవసరాల సమస్యలన్నింటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ దిశా నిర్దేశంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. గుల్లదుర్తి గ్రామంలో వెయ్యి ఇళ్ళు, 3500 మంది జనాభా ఉందని ప్రజల ఆకాంక్షలు, అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ప్రజా వేదిక కార్యక్రమంలో ప్రజలు మంత్రికి వివరించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం పొలం పిలుస్తోంది గోడపత్రికను, ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను మంత్రి, కలెక్టర్ ఆవిష్కరించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక