Uncategorized
జీవో 85 రద్దు కై కొనసాగుతున్న వైద్యుల సమ్మె :జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వినతి పత్రం వైద్యులు అందిస్తున్న వైద్యులు

ఏపీ టుడే న్యూస్- నంద్యాల జిల్లా- సిరివెళ్ళ- ఉల్లి గుర్రప్ప –
సిరివెళ్ళ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక వైద్యల సంఘం పిలుపుమేరకు ఈనెల 14 నుండి చేస్తున్న సమ్మెను కొనసాగిస్తున్నారు. అత్యవసర
కేసులు మినహా విధులను బహిష్కరించి శాంతియుత వాతావరణంలో నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం సరైనటువంటి చర్చలు జరపకపోవడం వల్ల ఈ సమ్మె
మరింత కాలం కొనసాగుతుందని శిరివెళ్ల ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య అధికారిని దివ్య పేర్కొన్నారు. తదుపరి చర్చలకు ప్రభుత్వం పిలిచిన తర్వాత సమ్మెను
కొనసాగించాలా వద్దా అన్నది రాష్ట్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం స్పష్టం చేస్తుందని అన్నారు. జీవో 85 రద్దు చేయాలని, ప్రభుత్వ సర్వీసులో ఉన్న వైద్యులు పీజీ
చదివేందుకు వెసులుబాటు కల్పించాలని, ప్రభుత్వ సర్వీసులో విధులు నిర్వహిస్తున్న ప్రాథమిక వైద్యులకు పదోన్నతులు
కల్పించాలని అలాగే గిరిజన ప్రాంతాలలో విధులు నిర్వహించే డాక్టర్లకు 30% అలవెన్స్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం కు సంబంధించి ప్రత్యేక ఆలవేన్స్
ప్రకటించాలని, 2020 నోషనల్ ఇంక్రిమెంట్లు పరచాలని అన్నారు.తమ డిమాండ్లు నెరవేర్చే వరకు రాష్ట్ర కమిటీ పిలుపు పిలుపుమేరకు సమ్మె
కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు దివ్య తెలియజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక