Connect with us

ఆంధ్రప్రదేశ్

మంత్రాలయం మండలంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి

Published

on

ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సాధించిన విజయాలు, తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని టీడీపీ పార్టీ నాయకులకు, మిత్రపక్ష పార్టీలు బీజేపీ, జనసేన, నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటు, ప్రజల ప్రతీ సమస్యలు తీరుస్తామని భరోసా కల్పించాలని మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి అన్నారు.మంత్రాలయం మండల పరిధిలోని చెట్నహళ్లి గ్రామంలో ఎంపీడీవో మని మంజరి ఆధ్వర్యంలో జరిగిన “ఇది మంచి ప్రభుత్వం” అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ…..వందరోజుల పరిపాలన వర్ణనాతీతం…అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడుకి అప్పగించినప్పటికీ ఆయన ఏమాత్రం కృంగిపోకుండా వంద రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. అభివృద్ధి సంక్షేమం రెండిటిని కూడా సమంగా ఈ వంద రోజుల్లో చేసి చూపించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు అని అన్నారు.సంక్షేమంలో సరిలేరు ఎవరు…ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వృద్ధులకు వికలాంగులకు వెయ్యి రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచి 7000 రూపాయలు చొప్పున 64 లక్షల మందికి.గత మూడు నెలల వెయ్యి రూపాయల బకాయిలను కూడా చెల్లించారు.16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి చర్యలు తీసుకున్నారు.దశలవారీగా అన్న క్యాంటీన్లు ప్రారంభ దశలో 100 మలిదశలో 74 ఏర్పాటు మన నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయాలని కోరానన్నారు.అర్చకుల వేతనాలు 10 నుండి 15000 నాయి బ్రాహ్మణులకు 15000 నుంచి 25000 పెంపు ఉచిత ఇసుక విధానము అమలు, ఉపాధి హామీ పథకం పని దినాలు పెంపు వంటివి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది.
అభివృద్ధి కి ఆకాశమే హద్దు….అప్పుల్లో కొరుకుపోయిన రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు నుండి15 వేల కోట్లు కేంద్రం నుండి రుణం ఇప్పిచ్చేలా కృషి పోలవరం తొలి దశ నిర్మాణానికి 12 వేల కోట్లు ,రాయలసీమను వెనకబడిన జిల్లాగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయింపు ,పంచాయతీలకు 1452 కోట్లు గత ప్రభుత్వం చేసిన నీరు చెట్టు, రాజధాని కౌవులు రైతులకు, గృహ నిర్మాణాల కు ఇవ్వాల్సిన 700 కోట్ల బకాయిలు చెల్లింపు వరద సమయంలో కొట్టుకుపోయిన తుంగభద్ర గేట్ నెంబర్ 19 స్థానంలో కొత్త గేటును అమర్చ రాయలసీమకు తాగునీరు సాగునీరు రక్షణ కల్పించారు కర్నూల్ ఇండస్ట్రియల్ హబ్ గా చేయడానికి అనేక కంపెనీలను ఆహ్వానిస్తున్నారు, పట్టాదారు పాస్ బుక్ పుస్తకాన్ని రాజముద్రతో రైతులకు అందిస్తున్నాము, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది మన ప్రభుత్వం. ఇలా వంద రోజుల్లోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న నారా చంద్రబాబు నాయుడుకి మనందరం ఎంతో రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్ధన్ రెడ్డి, బిజెపి కో కన్వీనర్ ఈరన్న, మండల నాయకుడు కులకర్ణి రాఘవేంద్ర, టిడిపి నాయకులు అశోక్ రెడ్డి, వరదరాజులు, ఎస్సై పరమేష్ నాయక్ , ఈఓ ఆర్ డి ప్రభావతి, ఏవో గణేష్, చేట్నహళ్లి గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580364
Total Users : 48048