ఆంధ్రప్రదేశ్
అత్యాధునిక క్యాంటెక్ టెక్నాలజీని నంద్యాల రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయండి. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ కు ఎంపీ బైరెడ్డి శబరి వినతి .

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
అత్యంత వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం నుంచి రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సామాన్య రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, నంద్యాల రైల్వే స్టేషన్ లో సెంటర్ ఫర్ అడ్వాన్స్ డు మెయింటనెన్స్ టెక్నాలజీనీ ( అత్యాధునిక క్యాంటేక్ టెక్నాలజీ ) ఏర్పాటు చేయాలని ఢిల్లీలోని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ కు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి వినతి పత్రం అందించారు.
ఈ సందర్బంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో మౌళిక సదుపాయాల కల్పన, రాష్ట్ర రాజధానికి, ఉత్తరాంధ్రా, కోస్తాంధ్రా, దేశంలోని ఇతర ప్రాంతాలకు రాయలసీమ నుంచి సామాన్య రైలు ప్రయాణికులు వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా మారిందన్నారు.
కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల మధ్య కేంద్రంగా ఉన్న నంద్యాల రైల్వే జంక్షన్ గుంటూరు, గుంతకల్లు, తిరుపతి వంటి ప్రధాన కోచింగ్ డిపోలలో ట్రాఫిక్ భారాన్ని తగ్గించడంలో వ్యూహత్మక ప్రాముఖ్యత నంద్యాల రైల్వే స్టేషన్ ఉందన్నారు. వివిధ రైలు సేవలను నంద్యాల వరకు పొడగించడం ద్వారా ఈ డిపో పై భారం చాలా వరకు తగ్గుతుందని వివరించారు. రాయలసీమ నుంచి అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడుతుందన్నారు. రైళ్ల ప్రాధమిక నిర్వాహన కోసం నంద్యాల రైల్వే జంక్షన్ లో లేదా సమీపంలోని 24 కోచ్ ల అత్యాధునిక క్యాంటెక్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ ను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. ప్రస్తుతం జరుగుతున్న గుంటూరు – గుంతకల్లు డబ్లింగ్ పనులకు అనుగుణంగా ఉంటుందని కూడా ఆమె వివరించారు. రైలు మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతుందని, రాయలసీమ మొత్తం ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతుందని, వెనుకబడ్డ మా ప్రాంతానికి ఈ ఆధునిక టెక్నాలజీ ఎంతో అవసరం అని కేంద్ర రైల్వే మంత్రికి నంద్యాల ఎంపీ శబరి వివరించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక