ఆంధ్రప్రదేశ్
ఆరుగురు దివ్యాంగులకు వీల్ చైర్స్, నలుగురికి వినికిడి యంత్రాల పంపిణీ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
దివ్యాంగులకు చేయూతను ఇవ్వడం కోసం ఆరు వీల్ చైర్స్, వినికిడి సమస్య ఉన్న నలుగురికి నాలుగు వినికిడి యంత్రాలను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలోని “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో ఆరుగురు దివ్యాంగులకు వీల్ చైర్స్, నలుగురికి వినికిడి యంత్రాలను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి అవసరమైన వీల్ చైర్స్ తదితర యంత్రాలను వారి శ్రేయస్సు కోసం అందజేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఈరోజు ఆరుగురు దివ్యాంగులకు ఆరు వీల్ చైర్స్, వినికిడి సమస్య ఉన్న నలుగురికి వినికిడి యంత్రాలను అందజేయడం జరిగిందన్నారు. వీల్ చైర్స్ లో కూడా ఆటోమోటర్ ఉన్న వాటిని వారికి అందిస్తే ఎవరి మీద ఆధార పడకుండా వారే స్వయంగా ఆపరేట్ చేసుకొని ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంటుందని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులను కలెక్టర్ ఆదేశించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక