ఆంధ్రప్రదేశ్
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత – ప్రిన్సిపాల్, డాక్టర్ పి నారాయణ రెడ్డి

కడప జిల్లా,
మైదుకూరు,
ఏపీ టుడే న్యూస్;
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదుకూరు నందు స్వచ్ఛత హై సేవా పక్షోత్సవాలు “స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత”-” పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత” అను కార్యక్రమంలో భాగంగా ఈరోజు విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపకులు స్వచ్ఛ సేవ ప్రతిజ్ఞను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పివి కృష్ణారెడ్డి చేయించారు. తదనంతరం ప్రతి విద్యార్థి మరియు అధ్యాపకుడు స్వచ్ఛతహై సేవా కార్యక్రమంలో ప్రతిజ్ఞకు సంబంధించిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ పి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాముఖ్యత ఉన్నందున ప్రతి సంవత్సరం 15 రోజులపాటు సెప్టెంబర్ 17 వ తేదీ నుండి అక్టోబర్ 2 తేదీ వరకు జరిగే స్వచ్ఛత హై సేవా కార్యక్రమాలు వివిధ రూపాలలో నిర్వహిస్తున్నారు. ప్రతి పౌరుడు, తమ వంతు బాధ్యతగా తమ పరిసర ప్రాంతాలను స్వచ్ఛంగా ఉంచుటకు ప్రతి సంవత్సరానికి 100 గంటలు అంటే ప్రతి వారం రెండు గంటలు స్వచ్ఛత కోసం స్వచ్ఛందంగా పని చేస్తాను అని, పరిశుభ్రంగా కనిపించే దేశాలు అలా ఉండటానికి కారణం వారి పౌరులు చెత్త వేయరు లేదా వదిలివేయనివ్వరు అని నేను నమ్ముతున్నాను ఈ నమ్మకంతో నా కళాశాలను, గ్రామాన్ని పట్టణాన్ని, దేశాన్ని స్వచ్ఛతగా ఉంచడానికి నాతోపాటు, మరో వంద మంది వ్యక్తులను ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని మరియు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి వి కృష్ణారెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సుభాన్ సాహెబ్, రామేశ్వర్ రెడ్డి, అనురాధ లక్ష్మి, అయ్యవారి రెడ్డి, సుబ్బరాయుడు, శశికాంత్ రెడ్డి, నవనీశ్వర్ రెడ్డి, నరసింహారావు, చిన్నరాయుడు,శ్రీనివాసులు, తదితర అధ్యాపకులు మరియు శివ కృష్ణ, కేశవ, చిన్న రాయుడు, శివ తదితర అధ్యాపకేతర బృందము, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక