ఆంధ్రప్రదేశ్
ప్రజా వినతులకు సత్వర పరిష్కారం చూపండి.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
పిజిఆర్ఎస్ కు 357 వినతులు.
దస్త్రాలన్నీ ఈ ఫైల్ ద్వారా పంపండి.
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.
ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ ఎ. పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వినతులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులను సీఎం స్వయంగా మానిటర్ చేస్తున్న నేపథ్యంలో నాణ్యతతో ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. జిల్లాలో 84 శాతం ఫిర్యాదులను పరిష్కరించారని, నంద్యాల అర్బన్, రూరల్, పాణ్యం మండలాలలో అధికంగా పెండింగ్ ఎక్కువగా ఉందని మండల స్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని మండలాలలో ఫిర్యాదులను పిజిఆర్ఎస్ వెబ్సైట్ లో చూడడం లేదని చూడడానికి కూడా ఇబ్బంది ఎందుకు పడుతున్నారని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. గ్రీవెన్స్ తమకు సంబంధించింది కాకపోతే సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేయాలే తప్ప క్లోజ్ చేయడం సరికాదన్నారు. ఫిర్యాదులలో అసంతృప్తి శాతం ఎక్కువగా ఉందని పాణ్యం, నంద్యాల, శిరివెళ్ల మండలాలలో అధికంగా అసంతృప్తి శాతం ఉందని ఆమె తెలిపారు. ఫిర్యాదుదారులతో గౌరవంగా మాట్లాడి సమస్యలకు సరైన పరిష్కారం చూపడం లేదా సరైన కారణాలు వివరించి ఎండార్స్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
ఏపీ సేవ పోర్టల్ ద్వారా నిర్ణీత కాల పరిమితిని అధిగమించి సేవలు అందిస్తున్నారన్నారు. ముందు సబ్జెక్టు మీద కమాండ్ పెంచుకొని లోపం ఎక్కడుందో గుర్తించి సరిచేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వే అండ్ ల్యాండ్స్, డిస్టిక్ రిజిస్టర్ శాఖలలో ఫిర్యాదులు అధికంగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. జిల్లాలో 90 శాతం ఈ ఆఫీస్ ద్వారానే ఫైల్ పంపిస్తున్నారని డివిజన్, మండల స్థాయిలో కూడా 15 రోజులలో ఈ ఆఫీస్ ద్వారానే దస్త్రాలు రావాలని కలెక్టర్ ఆదేశించారు.
పిజిఆర్ఎస్ లో కొన్ని సమస్యలు
1) నంద్యాల మండలం రైతునగరం గ్రామ కాపురస్తుడు శివప్రసాద్ తన ఇంటికి 50 మీటర్ల దూరంలో ఇటుకలు తయారీ ఫ్యాక్టరీ వున్న కారణంగా దుమ్ము,ధూళి వల్ల అనారోగ్యం కలుగుతోందని… ఆ ఫ్యాక్టరీ నీ అక్కడ నుండి తొలగించి వేరొక ప్రదేశానికి మార్పు చేయగలరని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.
2) నందికొట్కూరు మండల వాస్తవ్యుడు దౌలత్ బాషా అల్లూరు రోడ్డులో మినార్ మసీద్ నందు తాను 60 సంవత్సరాలుగా నమాజ్ చదువుతున్నానని, ప్రస్తుతం ఆ మసీద్ శిధిలావస్థలో వున్నందున కొత్త మసీద్ నిర్మించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తును సమర్పించుకున్నారు.
3) నంద్యాల పట్టణానికి చెందిన అబ్దుల్ ఖాదర్ తనకు పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామంలో సర్వే నంబర్ 44 – 1A1A నందు ఒక ఏకరా 25 సెంట్లు, సర్వే నంబర్ 44 – 2A లో ఒక ఏకరా 98 సెంట్ల పొలం ఉన్నదని ఆ పొలాలను కొలతలు వేయించి మ్యాపింగ్ చేయించగలరని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో 357 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక