ఆంధ్రప్రదేశ్
కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ దుర్బుద్ధితో సీఎం చంద్రబాబు నాయుడి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సిపి నాయకులు.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం పై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ దుర్బుద్ధితో లేవనెత్తినకొన్ని దుష్ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఇటువంటి అసత్యపు ప్రచారాలు ఇకనైనా సీఎం చంద్రబాబు నాయుడు మానుకోవాలని, ఆ అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మంచి బుద్దిని ప్రసాదించాలని, ఇటువంటి రాజకీయ కుయుక్తులకు ఇకనైనా స్వస్తి పలకాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి నాయకులు కోరారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తిరుపతి లడ్డు ప్రసాదం పై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళనం చేయాలని ఆ దేవదేవుని వేడుకున్నారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు ప్రసాదం పై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వైఎస్ఆర్ పార్టీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై దుష్ప్రచారాలు చేస్తున్నారని, ఇది తగదన్నారు. కోట్లాదిమంది మనోభావాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు పలుమార్లు వివేచనతో ఆలోచించి వెల్లడి చేయాలని హితవు పలికారు. ఒకవేళ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ ఉన్నట్లు అనుమానాలు ఉంటే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో ఎటువంటి విచారణ అయినా చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు హర్షించరని అన్నారు.
గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలతో వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను చేశామన్నారు. చంద్రబాబు నాయుడుకు సద్బుద్ధి ప్రసాదించాలని, రాష్ట్రం బాగుండాలని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత, తిరుపతి లడ్డు విశిష్టత మరింత ముందుకు తీసుకువెళ్ళి భక్తుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేందుకు వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ప్రతాప్ రెడ్డి, రామసుబ్బయ్య, శరత్, కౌన్సిలర్స్ కృష్ణమోహన్,పున్న రాజేశ్వరి, మాజీ కౌన్సిలర్స్ లక్ష్మీనారాయణ ,పున్న శేషయ్య, కిరణ్ కుమార్, చింత శ్రీనివాసులు, రామ సుబ్బారెడ్డి, శివ నాగిరెడ్డి, దండే సుధాకర్, దండే శ్రీనివాసులు, రవికుమార్ రెడ్డి, శంకర్ నాయక్, కుమ్మరి రాముడు, సన్నాల సాయిరాం రెడ్డి, టివి రమణ, చింతకుంట్ల భాస్కర్ రెడ్డి, మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక