ఆంధ్రప్రదేశ్
బిఎస్ఎన్ఎల్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ర్యాలీ

బిఎస్ఎన్ఎల్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ర్యాలీ.
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్
కర్నూలు బ్యూరో
భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ 25వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు మరియు టీఐపీలు, ఫ్రాంచైజీలు ;జనరల్ మేనేజర్ శ్రీ జి రమేష్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మేము సైతం సమాజ అభివృద్ధికి నాణ్యమైన టెలికాం సేవలను అందిస్తామని ఉద్యోగులందరూ నినాదాలు చేస్తూ ప్రకాష్ నగర్ లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం నుండి ర్యాలీ మొదలయ్యి మున్సిపల్ ఆఫీసు మీదుగా కొండారెడ్డి బురుజు, పెద్ద పార్కు ,రాజ్ విహార్ , కలెక్టర్ ఆఫీస్ వరకు కాలినడకన ర్యాలీ నిర్వహించారు . ప్ల కార్డ్స్, బ్యానర్స్ మరియు కరపత్రాలు పంచుతూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, కప్రజలందరికీ బిఎస్ఎన్ఎల్ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
బిఎస్ఎన్ఎల్ ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తయ్యాయి . పట్టణ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాలకు , కొండ ప్రాంతాలకు కూడా టెలికాం సర్వీసులను విస్తరిస్తూ సుస్థిర సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉన్నది. 2000 సంవత్సరంలో (1-10-2000) బిఎస్ఎన్ఎల్ ఆవిర్భావం కాకముందు భారతదేశంలో టెలికాం సర్వీస్ లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ ద్వారా ఎటువంటి లాభా పేక్ష లేకుండా అన్ని ప్రాంతాలను టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా అనుసంధానం చేయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు తర్వాత కూడా నాణ్యమైన సేవలను అతి తక్కువ ధరల్లో అందజేస్తున్నామని చెప్పారు.
ప్రజల చేత ఏర్పాటు చేయబడిన భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ను ప్రజలు ఎల్లప్పుడూ ప్రేమిస్తూ, ఆదరిస్తున్నారని ; ఈ ఆదరణ, ప్రేమను కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.
బిఎస్ఎన్ఎల్ ఎఫ్ టి టి హెచ్ లో కొత్త ప్లాన్లు:
భారత్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలతో మారుమూల గ్రామాలకు అత్యధిక నాణ్యతతో కూడిన ఇంటర్నెట్ సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. అతి తక్కువ ధరకే అత్యధిక స్పీడు మరియు ఓటీటీ సర్వీసులను అందించడానికి బిఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతుందని, ఫైబర్ నెట్ యూజర్ల కోసం 18004444 వాట్సాప్ చాట్ బాట్ ప్రారంభించామని ,ఈ అవకాశాల్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము .
మనసున్న దాతలకు బిఎస్ఎన్ఎల్ కొత్త స్కీమ్ “విద్యామిత్రం”.
సమాజంలోని మనసున్న దాతలు విద్యార్థులకు లేదా ఇతర అర్హులకు వ్యక్తిగతంగా కానీ సంస్థగా కానీ విరాళాలు ఇవ్వ తలచిన వారికి బిఎస్ఎన్ఎల్ ” విద్యామిత్రం” అనే కొత్త స్కీంను ప్రవేశపెట్టింది . నేటి తరంలో, ఇంటర్నెట్ లేని సమాజం ఊహించలేనిది.
నిత్యవసరాలు కూడు ,గూడు, గుడ్డ మరియు “ఇంటర్నెట్ డేటా” అవసరమైన ఈ రోజుల్లో, ప్రతి విద్యార్థికి , స్కూల్లకు , కాలేజీలకు, హాస్టళ్లకు మరియు అవసరం ఉన్న ఇతరులకు ఇంటర్నెట్ సేవలు విరాళంగా ఇవ్వ తలచిన వారు ఈ “విద్యామిత్రం “స్కీమును ఉపయోగించవలసిందిగా కోరారు.
“విద్యామిత్రం” స్కీం కింద 329 ప్లాన్ (ఫైబర్ ఎంట్రీ ప్లాన్ ) సంవత్సర చందాతో ముగ్గురికి విరాళం ఇస్తే 11000 రూపాయలు మరియు ఆరుగురికి విరాళం ఇస్తే 21 వేల రూపాయలు, 10 ఇంటర్నెట్ కనెక్షన్లు విరాళంగా ఇస్తే 35 వేల రూపాయలు మాత్రమే తగ్గింపు ధరలో ఇవ్వవచ్చు .
నేటి రోజుల్లో ఇంటర్నెట్ అవసరం చాలా ఉంది. విరాళంలో భాగంగా ఇంటర్నెట్ సేవలను కూడా విరాళంగా ఇవ్వ తలచిన వారు “విద్యామిత్రం” స్కీమును ఉపయోగించవలసిందిగా కోరారు.
విద్యాసంస్థల యాజమాన్యాలు, మరియు సంఘంలోని పేరున్న గొప్పవారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
బిఎస్ఎన్ఎల్ 4జి సేవలు ప్రారంభం .
కర్నూలు జిల్లావ్యాప్తంగా 4జి సేవలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని తెలిపారు . ఇప్పటికే సుమారు 101 టవర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం “ఆత్మనిర్బర భారత్” అడుగులకు అనుగుణంగా దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో ఈ సేవలను తీసుకొస్తున్నామని తెలిపారు . ప్రముఖ ఐటీ కంపెనీ టిసిఎస్, ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ సి -డాట్ కలిసి దేశీయ 4జి టెక్నాలజీని అభివృద్ధి చేశాయి . 4జి సేవలు త్వరలో ప్రారంభిస్తున్నమని తెలిపారు .
* కావున వినియోగదారులు అందరూ 4జి సిమ్ లోకి అప్ గ్రేడ్ చేసుకొని , డిజిటల్ ఇండియా లో భాగంగా గతంలో పేపర్ అప్లికేషన్ ద్వారా యాక్టివేషన్ చేయబడిన సిమ్ లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం వినియోగదారులు తమ దగ్గరలోని బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లో లేదా ఫ్రాంచైజీనీ సందర్శించి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.
బిఎస్ఎన్ఎల్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని డ్రాయింగ్ కాంపిటీషన్
బిఎస్ఎన్ఎల్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని డ్రాయింగ్ కాంపిటీషన్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో సుమారు 2100 విద్యార్థులు పాల్గొన్నారు. ముగ్గురు విజేతలను ప్రకటించారు. మొదటి విజేత సిస్టర్స్ ట్రాన్స్లేషన్ స్కూల్ నందు ఐదవ తరగతి చదువుతున్న ఎం.సహస్ర అనే విద్యార్థికి , మరియు డోన్ పట్టణం శ్రీ సుధా హై స్కూల్ నందు చదువుతున్న పి .శ్రీకృతి అనే అమ్మాయికి రెండవ బహుమతి; మరియు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ , ఐదవ తరగతి
కే జితేష్ విద్యార్థికి థర్డ్ ప్లేస్ ప్రకటించారు. మొదటి విజేతకు ఒక సంవత్సరం పాటు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యము , రెండవ విజేతకు ఆరు నెలల పాటు , మూడవ విజేత మూడు నెలల పాటు ఉచితంగా అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ కె .రాజేశ్వర రావు, ఐ .ఎఫ్. ఏ డి. శ్రీలత , ఏజీఎం ఆపరేషన్ శ్రీ పి. శ్రీనివాసరావు, ఏజీఎం అడ్మిన్ వి. శ్రీను నాయక్ , ఏజీఎం డోన్ జి.నారాయణస్వామి, ఏజీఎం మొబైల్ ఇన్స్టాలేషన్ శ్రీ ఎన్. చంద్రశేఖర్, ఏజీఎం ట్రాన్స్మిషన్ శ్రీ జి. వి .మురళీకృష్ణ , ఏజీఎం ప్లానింగ్ శ్రీ వి. జాన్సన్ మరియు సబ్ డివిజనల్ ఇంజనీర్స్ , టీఐపీలు, ఫ్రాంచైజీలు, ఇతర సిబ్బంది ,విశ్రాంత ఉద్యోగులు, అసోసియేషన్ మరియు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక