ఆంధ్రప్రదేశ్
అహింసా మార్గంద్వారా ఏదైనా సాధించవచ్చునని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి గాంధీజీ.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నీతి, నిజాయితీకి నిలువుటద్దం లాల్ బహుదూర్ శాస్త్రి .
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత గాంధీ ఆశయాలను ఆచరణలో పెడుతున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నంద్యాలలోని గాంధీ చౌక్ నందు గాంధీ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు .
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అహింసా మార్గంలో ఏదైనా సాధించవచ్చునని, భారతదేశానికి స్వాతంత్ర్య సాధించి, మహాత్మా గాంధీ గారు నిరూపించారన్నారు . సత్యం , అహింసా అనే ఆయుధాన్ని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు . యుద్ధాలు, దండయాత్రల తో కొట్టుక చస్తున్న ప్రపంచం అంతా కూడా నేడు గాంధీ మార్గాన్ని అనుచరిస్తూ శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటున్నాయన్నారు . అందుకే ఐక్యరాజ్య సమితి గాంధీ పుట్టినరోజు అయిన అక్టోబర్ 2 వ తేదీని ప్రపంచ అహింసా దినోత్సవము గా ప్రకటించిందని , ఇది భారతీయులు అందరూ గర్వించదగిన విషయం. గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన అహింసా మార్గములో పయనించడమే ఆయనకు నిజమయిన నివాళి అర్పించడము అన్నారు.
గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీ కలలు కన్నారని . అయితే దానిని గత వైసిపి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు . స్థానిక సంస్థల నిధులు దారి మళ్లించి వాటిని నిర్వీర్యం చేసిందన్నారు .ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి గ్రామాలలో అభివృధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, గాంధీ ఆశయాలను ఆచరణలో పెడుతుందన్నారు.
నీతి, నిజాయితీకి నిలువుటద్దం లాల్ బహుదూర్ శాస్త్రి .
భారతదేశ దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవకు ఒక్కసారి గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు .శాస్త్రి నీతి, నిజాయితీ, నిరాడంబరానికి నిలువుటద్దము లాంటి వాడన్నారు .ఇద్దరు మహనీయులు పుట్టిన అక్టోబర్ 2 వ తేదీ భారతీయులకు పవిత్రమయిన రోజు ఈ సందర్భంగా వారి ఇరువురి మధ్య పేద నివాళులు అర్పిస్తూ వారు చూపిన బాటలో పయనిద్దాం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇషాక్ బాషా , మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా , డిఆర్ఓ ఎ. పద్మజ , కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక