ఆంధ్రప్రదేశ్
రాజ్యాలు గెలవాలంటే యుద్ధాలే చేయక్కర్లేదు. అహింసతో కూడా గెలవచ్చని నిరూపించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ ఎన్ఎండి ఫిరోజ్.

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
రాజ్యాలు గెలవాలంటే యుద్ధాలే చేయక్కర్లేదు. అహింసతో కూడా పోరాడి గెలవచ్చని నిరూపించిన మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ అని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కొనియాడారు. నంద్యాల స్థానిక గాంధీ చౌక్ లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఒక్కడిగా ముందుకు వచ్చిన మహాత్మా గాంధీ తన పోరాటంలో భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహానుభావుడన్నారు. మహాత్మా గాంధీ గొప్పతనం తెలియని వ్యక్తులు ప్రపంచంలో ఎవరూ ఉండరనీ, తరాలు మారిన గాంధీ సిద్ధాంతాలు, ఆయన చేసిన పోరాటాలు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటాయన్నారు. ప్రపంచంలో నేటికీ కోట్లాదిమంది గాంధీ చూపిన బాటలో నడుస్తున్నారంటే ఆయన సిద్ధాంతాలు ఎంత గొప్పవో చెప్పనవసరం లేదని ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు.
‘జై జవాన్, జై కిసాన్’ పిలుపునిచ్చి దేశాన్ని ముందుకు నడిపించిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి. ఎన్ఎండి ఫిరోజ్.
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నంద్యాల స్థానిక కల్పనా సెంటర్ నందు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఘనంగా నివాళులర్పించారు .
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ‘జై జవాన్, జై కిసాన్’ పిలుపునిచ్చి దేశాన్ని ముందుకు నడిపించిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అని ఆయన నిజాయితీ, నిరాడంబరత, వ్యక్తిత్వం, త్యాగశీలత అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు . ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా దేశం గర్వించదగ్గ ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నామన్నారు . అలాగే దేశాన్ని సైనిక పరంగా, వ్యవసాయ పరంగా పటిష్ట పరిచిన దార్శనికుడు స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ఒకరన్నారు . ఆయన జయంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో 12 వార్డు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ , బింగుమల్ల శ్యాంసుందర్ గుప్తా , అఫ్జల్ , గోవిందు నాయుడు , మిద్దె చిన్న ఉసేని , కేఎల్ దీపక్ రెడ్డి , ఇసుక చాంద్ , సర్దార్ , కామిని మల్లికార్జున , భాస్కర్ , సుధాకర్ , అలీ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక