ఆంధ్రప్రదేశ్
టిజివి గ్రూప్స్ తరుపున దుర్గామాత మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టిజివి సంస్థల తరుపున దుర్గామాత మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది రూ. 5 లక్షలు ఖర్చు పెట్టి 47 మట్టి విగ్రహాలు తయారుచేయించి అందిస్తున్నట్లు మంత్రి టి.జి భరత్ తెలిపారు. విగ్రహాలకు సంబంధించిన కూపన్లను మంత్రి టి.జి భరత్ ఆయన కార్యాలయంలో నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యేడాది కూడా మట్టి విగ్రహాలు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల్లాగే దుర్గామాత ఉత్సవాలు కూడా కర్నూల్లో వైభవంగా జరుపుకుంటామన్నారు. రాబోయే ఐదేళ్లలో కర్నూల్లో మట్టి వినాయకుని విగ్రహాలు మాత్రమే ప్రతిష్టించేలా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో విధ్వంసం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ప్రజలకు గొప్ప వరమన్నారు. దుర్గామాత ఆశీస్సులు సీఎం చంద్రబాబుపై ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68045