ఆంధ్రప్రదేశ్
నంద్యాల పట్టణంలోని నడిగడ్డ నందు ప్రజా సమస్యల పరిష్కార గ్రీవెన్స్ – ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్యులు నంద్యాల శాసనసభ్యులు ఎన్ ఎం డి ఫరూక్ .

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ప్రజాసమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు ప్రజల మధ్యకు చేరుకొని వినతులను స్వీకరించి సానుకూలంగా స్పందించి త్వరితగతిన వాటి పరిష్కారం కొరకు అధికారులను రాష్ట్ర మంత్రివర్యులు ఆదేశించారు.
ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తే వారి సమస్యలను విని అక్కడికక్కడే పరిష్కరించి వారికీ చక్కటి వివాహ విందు లాంటి భోజన సదుపాయం రాష్ట్ర మంత్రివర్యులు కల్పించారు.
నంద్యాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికీ సేవచేసి వారి రుణం తీర్చుకుంటాం అని ఫరూక్ , రాష్ట్ర మంత్రివర్యులు తెలిపారు.
నంద్యాల పట్టణం 3వ వార్డు స్థానిక నడిగడ్డ సర్కిల్ నందు నిర్వహించిన ప్రజా వేదిక ప్రజా సమస్యల పరిష్కార గ్రీవెన్స్ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ ఎం డి ఫరూక్ , టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఎం డి ఫిరోజ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్.ఎం.డి ఫరూక్ మాట్లాడుతూ గత పాలకులు ప్రజలను గాలికివదిలేసి పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు.నంద్యాల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి గత పాలకులను కలిసే పరిస్థితే లేకపోవడంతో దళరులను నమ్మి మోసపోయరన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం చేస్తూ సంక్షేమ రాజ్యం నిర్మిస్తూన్నామన్నారు.
నంద్యాలలో తానే స్వయంగా ప్రతి నెల నంద్యాల పట్టణంలో నంద్యాల మండలంలో గోస్పాడు మండలంలో ప్రజలను నేరుగా కలిసి గ్రీవెన్స్ ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కరిస్తానని తెలిపారు.ఈ సందర్బంగా వివిధ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించి వాటిని తానే స్వయంగా నమోదు చేసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తే వారి సమస్యలను విని అక్కడికక్కడే పరిష్కరించి వారికీ చక్కటి వివాహ విందు లాంటి భోజన సదుపాయం రాష్ట్ర మంత్రివర్యులు కల్పించడం తో ప్రజలు ఏంతో సంతోషంతో తమ సమస్యలు పరిష్కారం కాబోతున్నయని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఎం డి ఫిరోజ్ , కౌన్సిలర్లు పిచ్చుక నాగార్జున,కండే శ్యాంసుందర్ లాల్, దూదేకుల జైనాబి,టీడీపీ నాయకులు మానియర్ ఖలీల్, ఇక్బాల్, అక్బర్ బాష, షేక్ అలీ,గౌరీ,ఖాదర్ భాష,ప్రభుత్వ మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది,వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక