ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని, క్వింటల్ కు 3,000రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్క్ ఫెడ్ ద్వారా మొక్క జొన్న రైతుల నుండి కొనుగోలు చేయాలని కలెక్టర్ కార్యాలయం ముట్టడి. జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన సీపీఐ, ఎపి రైతు సంఘమునాయకులు .

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని, క్వింటల్ కు 3,000రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్క్ ఫెడ్ ద్వారా మొక్క జొన్న రైతుల నుండి కొనుగోలు చేయాలని సీపీఐ, ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు, జిల్లా సహయ కార్యదర్శి ఎస్ బాబాఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు కే. రాధాకృష్ణ, నాగరాముడు, భాస్కర్, మోటారాముడు, సిపిఐ సీనియర్ నాయకుల సంజీవులు, జిల్లా సమితి సభ్యులు డి శ్రీనివాసులు, వై. భార్గవ్, బాలకృష్ణ, హరినాథ్, జి. రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లానాయకులు నరసింహులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్నకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని, అకాల వర్షాలకు తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, మద్య దళారిలను అరికట్టి మార్కఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, వెలుగోడు మండలంలో మొక్కజొన్న పంటకు కాపలాగా ఉన్నయువ రైతు శివగంగాధర్ రావు కుటుంబానికి 50 లక్షల రూపాయలిచ్చి ఆదుకోవాలని కోరుతూ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నూనెపల్లె ఓవర్ బ్రిడ్జి నుండి దాదాపు వందల మంది రైతులతో కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్విస్తున్న కలెక్టర్ చాంబర్ వద్దకు చొచ్చుకుపోయి డిమాండ్స్ కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ రాజకుమారీ గనియాకు ఇవ్వడం జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సోమన్న అధ్యక్షతన నిర్వహించగా.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు. మాట్లాడుతూ
నంద్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులు 20 వేల హెక్టార్లలో మొక్క జొన్న పంట వేయడం జరిగిందని, సిపిఐ, ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజులు నుండి జిల్లాలో మొక్కజొన్న పండించిన ప్రాంతాలను పరిశీలించి రైతులతో చర్చించడం జరిగిందని, కానీ మొన్న కురిసిన అకాల వర్షాల వల్ల అధిక శాతం మొక్కజొన్న పంట చేతికి రాక రైతులు ఇబ్బందులకు గురైనారని, వాటితో పాటు ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో మధ్య దళారులు రైతులను మోసిగించే పద్ధతిలో క్వింటాలు 2,300 రూపాయలు కొంటున్నారని, వేసిన పంటకు తగిన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు రైతుల బాధలు తెలిపేందుకు ప్రజా వేదికలో విన్నవించగా జిల్లా అధికారులను పంపినామని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. మార్క్ ఫెడ్ అధికారులు మధ్య దళారులను నమ్మకుండా రైతుల నుండి మొక్కజొన్న కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోసిపిఐ నాయకులు భూమని శ్రీనివాసులు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు, మహిళా సంఘం నాయకురాళ్లు లక్ష్మీదేవి, రజిత,సుశీలమ్మ. ముర్తుజాబి, మున్ని, ఏఐవైఎఫ్ నాయకులు భాస్కర్, రవి ఉదయ్. జిల్లా నలుమూలల నుండిమొక్కజొన్న రైతులు. తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక