ఆంధ్రప్రదేశ్
స్మశాన వాటికలకు స్థలాలు అన్వేషించండి.

200 రోజుల ప్రణాళిక లక్ష్యాలను సిద్ధం చేయండి.
ఏపీ సేవా సర్వీసులను క్లియర్ చేయండి.
స్వర్ణాంధ్ర@2047 క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ప్రజాభిప్రాయాలు సేకరించండి.
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
జిల్లాలో అన్ని గ్రామాలలో స్మశాన వాటికలకు స్థల సమస్య ఉందని రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి స్థలాలను అన్వేషించి నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆర్డీఓలు, తాసిల్దారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలలో భాగంగా జిల్లా అధికారులు, మండల స్థాయి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ స్మశాన వాటికల స్థల కేటాయింపుపై 2023 సంవత్సరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినప్పటికీ ప్రతి మండలంలో స్మశాన వాటికల స్థల సమస్య ఉందని మండల తాసిల్దారులు, ఆర్డీఓలు ప్రత్యేక దృష్టితో స్థలాలను అన్వేషించి గ్రామాల వారీగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. స్మశాన వాటికల స్థల సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తాపత్రికలలో ప్రతికూల వార్తలు వస్తున్న నేపథ్యంలో పుణ్యకార్యంగా భావించి ప్రాధాన్యతాంశంగా స్థలాలను అన్వేషించి గ్రామాల వారిగా నివేదికలు అందజేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న 60 చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు కూడా స్థలాలను గుర్తించి కేటాయింపుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఏపీ సేవా సర్వీసుల కింద 1753 దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఎ లోకి వెళ్లాయని జిల్లా అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు వారంలో ఒకరోజు కేటాయించుకుని క్లియర్ చేయాలని ఆమె సూచించారు. రెవెన్యూ లో 1,208, పోలీస్ శాఖలో 184, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 90 తదితర శాఖల్లో పెండింగ్లో ఉన్న ఏపీ సేవా సర్వీసులను రెండు రోజులలో క్లియర్ చేయాలని ఆమె ఆదేశించారు. ఏపీ సేవా సర్వీస్ ద్వారా 540 సర్వీస్ లను ప్రజలకు అందిస్తున్నామని ఆలస్యం చేయకుండా నిర్ణీతకాల పరిమితిలోగా ప్రజలకు సేవలు అందించాలన్నారు.
200 రోజుల కార్యాచరణ ప్రణాళికా లక్ష్యాల సాధనపై దసరా పండుగ తర్వాత ప్రతివారం తాను సమీక్షిస్తానని ఇందుకు సంబంధించి నివేదికలో పొందుపరిచిన విధంగా పురోగతి కనపడాలని అధికారులను సూచించారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ద్వారా 90 కోట్ల రూపాయల పనులకు సంబంధించి పరిపాలన ఉత్తర్వులు మంజూరు చేశామని ఈనెల 14 నుండి 21 తేదీలోగా రోడ్లు, డ్రైన్లు, తదితర నిర్మాణ పనులకు సంబంధిత ప్రజాప్రతినిధులతో శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. పనుల ప్రగతిపై ప్రతి బుధవారం తాను సమీక్షిస్తానన్నారు. ఉపాధి హామీ కింద ప్రభుత్వం కేటాయించిన నిధులను ఫిబ్రవరి నెలాఖరులోగా ఖర్చు చేయాల్సి ఉందని ఇందుకు సంబంధించి ప్రతిపాదించిన పనులను వేగవంతం చేయడంతో పాటు లేబర్ మొబిలైజేషను విపరీతంగా పెంచాలని కలెక్టర్ ఎంపీడీఓలు, డ్వామా అధికారులను ఆదేశించారు.
స్వర్ణాంధ్ర@2047 దార్శనిక రూపకల్పనకు సంబంధించి రైతులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, అన్ని వర్గాల ప్రజల నుండి క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా అభిప్రాయాలు సేకరించాలన్నారు. అన్ని జిల్లాలలో లక్ష, లక్షన్నరకు పైగా ఫీడ్బ్యాక్ సేకరించారని మన జిల్లాలలో 60,000 మాత్రమే సేకరించారని ప్రత్యేక ఫోకస్ పెట్టి చేయించాలన్నారు. రైతులు సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి 97 శాతం మాత్రమే ఈ-పంట నమోదు అయిందని మిగిలిన మూడు శాతం ఈ- పంటను త్వరితగతిన పూర్తి చేసి ఈకేవైసీను ప్రక్రియను ముగింపు చేయాలన్నారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, సోయాబీన్ పంటనష్ట వివరాలను ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. రోజువారి ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలపై క్షేత్రస్థాయిలో విచారించి సరైన నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక