ఆంధ్రప్రదేశ్
పరిహారం అందని బాధితులకు నగదు పంపిణీ

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
గత ఆగస్టు 30, 31 తేదీలలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గృహాలకు నష్టపరిహారం అందించామని సాంకేతిక కారణాలవల్ల పరిహారం అందని బాధితులకు నగదు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వెల్లడించారు. సోమవారం కలెక్టర్ లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలలో భాగంగా నష్టపరిహారం అందని పదిమంది బాధితులకు లక్ష రూపాయల నగదును బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ అధిక వర్షాల దెబ్బతిన్న పంటలు, గృహాలు, పశుసంపద బాధితుల పరిహారానికి సంబంధించి బ్యాంక్ ఖాతాలో ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో నిధులు జమ కాని 10 మంది బాధితులకు నగదు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందని బాధితుల అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని సంబంధిత మొత్తాలను కలెక్టర్ల అకౌంట్ లలోకి జమ చేసి నష్టపరిహారం అందని బాధితులకు అందజేయాలని ఆదేశించిందన్నారు. ఈ మేరకు అధిక వర్షాలకు దెబ్బతిన్న 331 గృహా బాధితులకు గాను 321 మంది ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని మిగిలిన 10 మంది బాధితులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున లక్ష రూపాయలు నగదు మొత్తాలను పంపిణీ చేశామని కలెక్టర్ వివరించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ ఎ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక