ఆంధ్రప్రదేశ్
ఐదేళ్ల అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 డాక్యుమెంట్ రూపకల్పన*

ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ జిల్లా గ్రోత్ ఇంజన్
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టి.జి.భరత్*
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఐదేళ్ల అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 డాక్యుమెంట్ రూపకల్పన చేయడం జరుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్ పేర్కొన్నారు.
కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర @2047 జిల్లా దార్శనిక ప్రణాళిక (2024-29) రూపకల్పనపై ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఒక విజన్ తో ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర@2047 ఐదేళ్ల విజన్ ప్రణాళికను రూపొందించడం జరుగుతోందన్నారు.. ప్రజా ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలతో గ్రామ,మండల, జిల్లా స్థాయిలో ప్రణాళికలను రూపొందించడం జరుగుతోందన్నారు..జిల్లాలో ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ గ్రోత్ ఇంజన్ అని, దీని వల్ల జిల్లాలో గణనీయమైన అభివృద్ధి సాధించనున్నామని మంత్రి తెలిపారు. దాదాపుగా 2 వేల 800 కోట్ల రూపాయలతో ఓర్వకల్లు నోడ్ అభివృద్ధి కానుందని తెలిపారు..షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు.. అధికారులు జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు..
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాలో ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధన లక్ష్యంగా ఐదేళ్లకు స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందించడం జరుగుతోందని పేర్కొన్నారు. 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తి కానున్న సందర్భంగా అన్ని రంగాల్లో రాష్ర్ట సమగ్రాభివృద్ధి ధ్యేయంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందించడం జరుగుతోందన్నారు.. ఇందులో భాగంగా ఐదేళ్ళ కాలంలో అభివృద్ధి లక్ష్యాలతో గ్రామ,మండల స్థాయిలో ప్రణాళికలను చేయడం జరిగిందని, జిల్లా స్థాయిలో ప్రణాళికల రూపకల్పన లో వివిధ వర్గాల ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయడం జరుగుతోందన్నారు..
ప్రధానంగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధిపై దృష్టి సారించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు..ఈ రంగాలతో పాటు విద్యా, వైద్య రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే విధంగా ప్రణాళికను రూపకల్పన చేసి దానిని అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.
2022-23 ధరల్లో కర్నూలు జిల్లా జిడిడిపి 47514 కోట్లతో రాష్ట్రంలో 14వ స్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు.. జీవీఏ కి సంబంధించి జిల్లా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 17447 కోట్లతో 39.11%, సేవా రంగాల్లో 17180 కోట్లతో 38.52%, పారిశ్రామిక రంగంలో 9978 కోట్లతో 22.37%తో ఉందని కలెక్టర్ వివరించారు. వ్యవసాయ రంగంలో 10వ స్థానంలో, సేవా రంగంలో 12వ స్థానంలో, పారిశ్రామిక రంగంలో 13వ స్థానంలో ఉందని తెలిపారు. జిల్లా తలసరి ఆదాయం రూ.1,74,932 లతో రాష్ట్రంలో 19వ స్థానంలో ఉందని కలెక్టర్ వివరించారు.
జిల్లా గ్రోత్ ఇంజన్ లో భాగంగా ఓర్వకల్లు పారిశ్రామిక వాడ పై దృష్టి పెట్టడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా అన్ని రంగాల్లో మరింత వృద్ధి చెందే విధంగా ప్రణాళికను రూపొందించి, అమలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు..
జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 110 కోట్ల రూపాయలతో రోడ్లను నిర్మించడం జరిగితోందని కలెక్టర్ తెలిపారు.. వీటిని మార్చ్ 2025 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు..ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు ఐదేళ్ల ప్రణాళికలో పొందుపరచే అంశాల గురించి వివరించారు..
పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరంలో తన నియోజకవర్గానికి సంబంధించిన 16 వార్డుల్లో త్రాగు నీటి సమస్య పరిష్కారానికి గోరుకల్లు రిజర్వాయర్ నుండి నీరు తీసుకుని రావాలని కోరారు..ఈ వార్డు లోఅదే విధంగా రోడ్లు, డ్రెయిన్స్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పార్కులు చాలా వరకు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటి మీద ప్రత్యేక దృష్టి సారించి, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు.. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కు సంబంధించి అన్ని విభాగాల్లో సౌకర్యాలు ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచాలని కోరారు.. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం వల్ల ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని, స్థానికంగా చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్ ను నిర్మాణం చేయాలని, ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో అన్ని చెరువులను కూడా నింపాలని సూచించారు.. కర్నూలు నుండి వైజాగ్ వరకు వయా గుంటూరు, విజయవాడ మీదుగా ఎక్సప్రెస్ ట్రైన్ ఏర్పాటుకు చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ నుండి విజయవాడ కు ఫ్లైట్, నైట్ ల్యాండింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఓర్వకల్లు, కల్లూరు మండలంలో జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు. నంద్యాల చెక్ పోస్టు నుండి గార్గేయపురం వరకు, సఫా కాలేజీ వరకు,. పిఆర్, ఆర్ అండ్ బీ కు సంబంధించి గార్గేయపురం, కేతవరం, కొంగనపాడు రోడ్లు మంజూరు అయ్యాయని వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. టూరిజంకు సంబంధించి రాక్ గార్డెన్ ను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని, తడకనపల్లె గ్రామంలో పశువుల హాస్టల్ ఉందని దానిని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోరారు..
ఆదోని శాసనసభ్యులు డా.పార్థసారథి వాల్మీకి మాట్లాడుతూ ఆదోని ప్రాంతంలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో ప్రతి నెల సుమారుగా 450 ప్రసవాలు జరుగుతున్నాయని, 10 మంది నర్సింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు.. ఆదోని లో ఆరోగ్య శ్రీ క్రింద కొన్ని ఆస్పత్రులు రోగుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు..వలసల నివారణకు కస్తూర్బా, జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని, వసతి గృహాల్లో ఉన్న విద్యార్థినులకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, శానిటరీ నాప్కిన్స్ అందజేసేలా చూడాలన్నారు. అంతేకాకుండా కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. టూరిజంకు సంబంధించి రణమండల ఆంజనేయ స్వామి దేవాలయానికి రోడ్డు మార్గం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా ఆదోని ఆటో నగర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.. ఆదోని మార్కెట్ యార్డు లో మౌలిక వసతులు కల్పించాలని, మార్కెట్ యార్డు లో దళారులు రైతులను వడ్డీ పేరుతో ఇబ్బందులకు గురి చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక