ఆంధ్రప్రదేశ్
పట్టణ సుందరీకరణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ముమ్మర పారిశుధ్య చర్యలతో పాటు సురక్షిత మంచినీటిని అందించండి.
మురికి నీటి శుద్ధి ప్లాంట్ లకు స్థలాల ప్రతిపాదనలు పంపండి.
అన్నా క్యాంటీన్లను పర్యవేక్షించండి.
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.
జిల్లాలోని మున్సిపల్ ప్రాంతాలలో పట్టణ సుందరీకరణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో అన్న క్యాంటీన్లు, 200 రోజుల ప్రణాళిక, ఎస్టిపి ల్యాండ్, పట్టణ సుందరీకరణ, శానిటేషన్, త్రాగునీటి సరఫరా తదితర అంశాలపై మునిసిపల్ కమీషనర్లతో సమీక్షించారు. నంద్యాల ఆర్డీవో మల్లికార్జున్ రెడ్డి, నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ బేబీ, డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్, బేతంచెర్ల నగర పంచాయతీ కమిషనర్ హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ అన్ని మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో ముమ్మర పారిశుద్ధ పనులు చేపట్టడంతో పాటు సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలన్నారు. పట్టణ సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వంద రోజుల ప్రణాళికలో చేపట్టి పూర్తి చేసిన పనులన్నీటిని తాను స్వయంగా పరిశీలిస్తానన్నారు. అలాగే 200 రోజుల ప్రణాళిక లక్ష్యాల నివేదికలను తనకు సమర్పించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నూతనంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లను తరచూ పర్యవేక్షించాలన్నారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడంతోపాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలన్నారు. అన్న క్యాంటీన్లకు నిర్వహణకు సంబంధించి వార్తాపత్రికలలో ప్రతికూల వార్తలు వస్తే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. మురికి నీటి శుద్ధి ప్లాంట్ లకు అవసరమయ్యే స్థలాలకు నంద్యాలలో 3 ఎకరాలు, ఆళ్లగడ్డలో 2.8, ఆత్మకూరులో 3, నందికొట్కూరులో 3.4, డోన్ లో 7.5 ఎకరాల స్థల సేకరణ కొరకు సంబంధిత ఆర్డీవోలతో కోఆర్డినేట్ చేసుకొని వారం రోజుల్లో సంబంధిత ప్రతిపాదనలు కలెక్టరేట్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల తో పాటు మున్సిపాలిటీలలో అందుబాటులో ఉన్న నిధులతో పట్టణ సుందరీకరణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. డోన్ మున్సిపాలిటీలో అమృత్ సరోవర్ కింద ఈఎల్ఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణానికి అవసరమయ్యే 20 సెంట్లు స్థలాన్ని కూడా సంబంధిత ఆర్డీవోతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని డోర్ మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలో బయోగ్యాస్ కు అవసరమైన 5 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని నంద్యాల ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఇప్పటినుండే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కమిషనర్లను సూచించారు. నంద్యాల పట్టణంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు. అన్ని మున్సిపాలిటీలలోని పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని తలపించేలా గ్రీనరీ ని పెంచడంతోపాటు ఆకర్షణీయమైన రీతిలో రోడ్డులకు ఇరువైపులా రంగులతో దిద్దిన చిత్రాలను వేయడంతోపాటు డివైడర్ల మధ్యలో గ్రీనరీని పెంచాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక