ఆంధ్రప్రదేశ్
ములాయం ఆశయాలసాధనతోనే ఈ దేశంలో సమసమానత్వం సాద్యం. ములాయం వర్ధంతి సందర్భంగా సమాజ్వాదీ నేతలు

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి నేతాజీ స్వర్గీయ ములాయం సింగ్ యాదవ్ వర్ధంతి కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలోని రోటరీ స్కూల్ నందు నిర్వహించడం జరిగింది. సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు , సమాజ్ వాది పార్టీ రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ పాండురంగ యాదవ్ , సమాజవాది పార్టీ రాష్ట్ర మహిళా విభాగ సహాయ కార్యదర్శి షేక్ ఫరీదాబి , మరియు మూలయం బ్రిగ్రేడ్ రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ కుమార్ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా ములాయం సింగ్ యాదవ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ములాయం సింగ్ యాదవ్ పోరాట స్ఫూర్తిని రాష్ట్ర అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు తెలియజేశారు. అఖిలేష్ నాయకత్వం ఈ దేశానికి అవసరమని, రాష్ట్రంలో బలమైన శక్తిగా సమాజ్వాదీ పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తామని పాశం పేర్కొన్నారు. బహుజన ప్రగతితోనే సమసమానత్వం సాధ్యమని నమ్మి మూలయం సింగ్ యాదవ్ ముందుకెళ్లారని, లోక్ సభలో మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఘనత అఖిలేష్ కు దక్కిందని రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ యాదవ్ తెలిపారు. మైనారిటీలను సముచిత స్థానం ఇచ్చిన ఘనత మూలయంకు దక్కిందని షేక్ ఫరీదాబి తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఇప్పటినుంచి కృషి చేస్తామని జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్ పేర్కొన్నారు. ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాది పార్టీ వల్లనే సమసమానత్వం సిద్ధిస్తుందని పార్టీ శ్రేయోభిలాషి డాక్టర్ నాగేశ్వర రావు యాదవ్ తెలిపారు. మతతత్వ పార్టీలను ధీటుగా ఎదుర్కొన్న ఘనత మూలయం సింగ్ యాదవ్ కు దక్కిందని కాంగ్రెస్ నాయకులు చింతల మోహన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు అంబేద్కర్ వాహిని జిల్లా అధ్యక్షులు ఎనకండ్ల మధు, జిల్లా కార్యదర్శి నక్క రాజేష్, బీసీ నేతలు వాల్మీకి మనోహర్, సుబ్బయ్య ,విశ్వరూప ఆచారి, కుమ్మరి క్రాంతి, జమాల్, అబ్రహం, మనోహర్ యాదవ్, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు వెంకటాద్రి , ధనియాల నాగరాజు, మహేష్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక