ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నా

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 1 వార్డులో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకున్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.
తెలుగు రాష్ట్రాలు, దేశంలో ఉన్న దుర్గాదేవి భక్తులకు అందరికీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నంద్యాల ఒకటో వార్డు కౌన్సిలర్ నాగార్జున ఆహ్వానం మేరకు బుధవారం రాత్రి హరిజన పేటలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అత్యంత విశిష్టమైన అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున నంద్యాల ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టమని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు . చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగ చేసుకుంటారని రాబోయే రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు . దుర్గమ్మను తలచుకున్నా, పూజ చేసినా విజయానికి ఢోకా ఉండదనేది భక్తుల నమ్మకం అన్నారు .
ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి , వార్డు టిడిపి నాయకులు గురు ప్రసాద్ , గుల్లి , దుర్గ, ఆరంగుల బాలు , లెజెండ్ శీను , దుర్గాప్రసాద్ మరియు మహిళలు , యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక