ఆంధ్రప్రదేశ్
ఆర్ ఎ ఆర్ ఎస్ లో కాంట్రాక్ట్ కార్మికులను పాత పద్ధతిలోనే పిలవాలని రాస్తారోకో-సిఐటియు నాయకత్వం, అధికారులతో చర్చలు సఫలం.

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్ అక్టోబర్ 24.
ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం నంద్యాల పట్టణంలోని ఆర్ ఏ ఆర్ ఎస్ లో కాంట్రాక్ట్ వర్కర్స్ ని పాత పద్ధతిలోనే మస్టర్ పిలిచి పనులు చేయించుకోవాలని,కాంట్రాక్టు ఏ పద్ధతిలో ఎలాంటి నోటీసు లేకుండా ఎవరికి తెలియకుండా ఎందుకు ఇచ్చారో తెలియజేయాలని, ఆర్ ఎ ఆర్ఎస్ ఏడిఆర్ నియంతృత్వ వైఖరి నశించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాద్యక్షులు తోట మద్దులు, సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, కే మహమ్మద్ గౌస్, పట్టణ కోశాధికారి పి వెంకట లింగం లతోపాటు కాంట్రాక్టు కార్మికులు అయ్యన్న, పుల్లయ్య, సుజాత వీటితోపాటు 80 మంది కార్మికులు పాల్గొనడం జరిగింది.
అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, పట్టణ అధ్యక్ష ,కార్యదర్శులు లక్ష్మణ్ , కే మహమ్మద్ గౌస్ పట్టణ కోశాధికారి పి వెంకట లింగం లు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఆర్య ఆర్ఎస్ ఏర్పడిన 130 సంవత్సరాల నుండి గత నెల చివరి వరకు మాస్టర్ను లోపలనే పిలిచి కాంట్రాక్టు కార్మికులను పనిచేయుచుకునే వారిని నేడు చిన్నచిన్న సమస్యలు వస్తున్నాయని వీళ్ళను గేటు బయట మస్టర్ వేయించుకొని పనిచేయించుకోవాలని ప్రస్తుతం ఉన్న ఫారం సూపరిండెంట్ , ఏడిఆర్ నియంతృత్వంగా వ్యవహరించడం సరైంది కాదని, గతంలో మాదిరిగానే పాత పద్ధతిలో మస్టర్ లోపల పిలిచి పనులు చేయించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన పిఎఫ్ లో లోటుపాట్లు ఏళ్ల తరబడి ఉన్న వాటిని పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, కాంట్రాక్టు కార్మికుల మధ్య పేర్లు మార్చుతూ గొడవలు సృష్టిస్తూ చిన్నచిన్న సమస్యలను తీవ్రతరం చేస్తూ కార్మికుల మధ్య అనైక్యతను సృష్టిస్తూ గొడవలకు కారణమవుతున్నారని అన్నారు. కాంటాక్ట్ బిడ్ వేసే సమయంలో ఆఫీసులో ఉండే నోటీస్ బోర్డు కు లేదా పేపర్ ప్రకటన ఇవ్వాలని అలాంటివేమి జరగకుండా ఎవరికి తెలియకుండా తమ దగ్గర పనిచేసే వర్కర్ తో మస్టర్ను పిలిపించడం లో అంతర్యం ఏమిటని కాంట్రాక్టు ఎవరికి వచ్చిందో కాంట్రాక్టు కార్మికులకు తెలియజేయాలని, కాంట్రాక్టు పొందిన వాళ్లెవరో నేటికి తెలియడం లేదని కేవలం ఫారం సూపరిండెంట్ , ఏ డి ఆర్ లకు మాత్రమే తెలుసని గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వాటిని బయటపెట్టాలని, ఫారం సూపరిండెంట్ దగ్గర పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగిని మస్టర్ కోసం ఉపయోగించుకోవడం ఏమిటని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నంద్యాల ఆర్ ఎ ఆర్ఎస్ లో జరగడం చాలా దారుణమని అన్నారు. అనంతరం ఏడిఆర్ సీఐటీయు నాయకులతో చర్చలు జరిపిన అనంతరం సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది. అందరు కలిసి ఐకమత్యంగా ఉండి ఆర్ ఏ ఆర్ఎస్ అభివృద్ధి కోసం కృషి చేద్దామని ప్రపంచం దేశంలో ఉన్న స్థానాన్ని ఇంకా ఎగబాకెలా చూడాలని అందరూ అందుకు సహకరించాలని కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక