ఆంధ్రప్రదేశ్
పందిపాడు ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత్ర రెడ్డికి వినతి పత్రం అందజేసిన కాలనీవాసులు
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం, ఇండస్ట్రియల్ ఎస్టేట్,శ్రీ గోడల హనుమంతురాయుడు ప్రాంతం పందిపాడు ఇందిరమ్మ కాలనీవాసులు కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ శనివారం
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 15సంవత్సరాలుగా కాలనికి కనీసం రోడ్లు,నీరు,వీధిలైట్లు, కాలువలు వంటి సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.వర్షాకాలంలో బయటకు రాలేక పనులకు వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. అలాగే తాగడానికి నీళ్లు కోసం మూడు కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుందని పేర్కొన్నారు.కాలనిలో విషపురుగులు తిరుగుతున్నాయి ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నామని వారు తెలిపారు.వినతిపత్రం స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే రోడ్లు నీళ్లు,అన్ని సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కర్నూలు మున్సిపల్ సెక్షన్ ఇంజనీర్ కి ఫోన్ చేసి కాలనీలో సమస్యలు పరిష్కారించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాము,నాగేంద్రుడు, పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక