జిల్లా వార్తలు
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 14 మంది విద్యార్థులకు చెక్కులు పంపిణీ : చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 14 మంది విద్యార్థులకు చెక్కులు పంపిణీ : చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
*మనిషి జీవితంలో ఎంత ఎత్తు ఎదగాలన్న ఏమి సాధించాలన్నా చదువుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే మన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఆశయం అని పరిగి మండల బిజెపి కార్యదర్శి యాటకర్ల శ్రీనివాస్ అన్నారు*
వికారాబాద్ జిల్లా /పరిగి, ఏపీ టుడే న్యూస్:
చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని అప్పుడే మీరు మీ జీవితాశయాన్ని సాధించగలుగుతారని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు.
చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినం ను పరిగి బిజెపి మండల నాయకులు కార్యకర్తలు విద్యార్థుల మధ్యన ఘనంగా నిర్వహించారు. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కి బిజెపి జిల్లా కార్యదర్శి పెంటయ్య గుప్తా, పరిగి మండల బిజెపి కార్యదర్శి యాటకారుల శ్రీనివాస్, పరిగి పట్టణ బిజెపి అధ్యక్షుడు బాల్ కిష్టారెడ్డి, రాము యాదవ్, జిల్లా బిజెపి అధికార ప్రతినిధి రవీందర్,లు శాలువాలతో ఘనంగా సన్మానించారు. బుధవారం పరిగి మున్సిపల్ కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో విద్యార్థులు కార్యకర్తలు నాయకుల మధ్యన చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కేక్ కట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి ఉత్తమ ఫలితాలను సాధించిన 14 మంది విద్యార్థిని విద్యార్థులకు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఒక్కొక్కరికి 2500 చెక్కులను అందజేశారు. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉత్తమ ఫలితాలను సాధించి మీ తల్లిదండ్రుల కు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు విద్యను చదవడం వల్లనే తమ జీవితాలలో మార్పులు తీసుకురాగలుగుతారని మీ జీవిత ఆశయాలను సాధించాలంటే మీరు చదువులో రాణించినప్పుడే అది సాధ్యమవుతుందని కొండ విశ్వేశ్వర్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ప్రతి పేద విద్యార్థి తమ పేదరికం చదువుతోనే దూరం చేయగలుగుతాడు ఈ నగ్న సత్యం తెలుసుకుంటే ప్రతి విద్యార్థి తానే స్వయంగా ఉన్నతమైన మార్గంలో తీసుకుపోవడానికి కృషి చేస్తాడని కొండ విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులలో పోటీ తత్వం పెరగాలై తాను ముందుగా అన్ని రంగాల్లో సాధించాలని పట్టుదల రావాలని ఉద్దేశంతోనే ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థిని విద్యార్థులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు మీ జీవితాలు మీ చేతిలోనే ఉన్నాయని విషయాన్ని విద్యార్థులు గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పెంటయ్య గుప్తా, పరిగి మండల బిజెపి కార్యదర్శి యాటకర్ల శ్రీనివాస్, నస్కల్ మాజీ సర్పంచ్ జిల్లా ఓబీసీ సభ్యుడు కాసుల శ్రీనివాస్, పట్టణ బిజెపి అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాము యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక