ఆంధ్రప్రదేశ్
చేపల చెరువులకు నీటిని విడుదల చేసి ఆదుకోండి. * ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతుల విజ్ఞప్తి..

ఏలూరు, ఏపీ టుడే న్యూస్ మార్చి 8: వేసవి తీవ్రత నేపథ్యంలో నీటి కొరతను అధిగమించడానికి వీలుగా చేపల చెరువులకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ ను శనివారం కలిసిన రైతులు వినతిపత్రం అందజేశారు. నీటి కొరత కారణంగా జిల్లాలో చేపలు సాగు చేస్తున్న తాము ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. చేపల చెరువుల్లో తగిన స్థాయిలో నీటి నిల్వ లేకపోతే ఉత్పత్తి గణనీయంగా పడిపోవడానికి అవకాశం ఉందని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం జిల్లాలో తాగునీటి అవసరాల కోసం సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుందని, వరి రైతుల అవసరాలు మరియు తాగునీటి అవసరాలను తీర్చిన తర్వాత చేపల చెరువులకు సరిపడా నీటిని విడుదల చేయాలని రైతులు ఎంపీకి విన్నవించారు. ప్రస్తుతం నీటి కొరత సమస్య తీవ్రంగా ఉన్నందున చేపల సాగు చేస్తున్న రైతులు ఇబ్బందులు అధిగమించేలా నీటిని విడుదల చేయాలని రైతులు ఎంపీ మహేష్ కుమార్ ను అభ్యర్థించారు. తక్షణం స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ నీటిని విడుదల చేసి రైతుల అవసరాలు తీర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక