ఆంధ్రప్రదేశ్
నిర్లక్ష్యాన్ని విడనాడి మనసు పెట్టి పని చేయండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ఉపాధి హామీ పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయండి.
క్లస్టర్ల వారీగా ఇచ్చిన లక్ష్యాలను మరో 15 రోజులలోపు పూర్తి చేయండి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనులను నిర్ణీత కాలవ్యవధిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎంపీడీవోలు, ఎపిడిలు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఉపాధి హామీ పథకం కింద నిర్ధేశించిన లేబర్ బడ్జెట్, 100 రోజుల పనిదినాల కల్పన, హార్టికల్చర్, అవెన్యూ ప్లాంటేషన్ పనులు, సంస్థాగత ప్లాంటేషన్ పనులు, బ్లాక్ ప్లాంటేషన్ పనులు, ఫారం పాండ్స్, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులు, పశుసంపద షెడ్లు, ట్రెంచ్ పనుల ప్రగతి లక్ష్యాలపై డ్వామా పిడి రామచంద్రారెడ్డితో కలసి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్లస్టర్ల వారీగా సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనుల లక్ష్యాల ప్రగతిలో మన జిల్లా దిగువ స్థానంలో ఉందని చేపట్టిన పనులు నిర్ణీత కాలవ్యవధిలోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవోలు, ఎపిడిలు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఆత్మకూరు, జూపాడుబంగ్లా, కొత్తపల్లి, మిడుతూరు, డోన్, ప్యాపిలి, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, రుద్రవరం తదితర మండలాల లక్ష్యసాధనలో జీరో శాతంతో పేలవమైన పనితీరు కనిపిస్తోందన్నారు. పద్ధతి మార్చుకొని పనితీరు మెరుగుపరుచుకుని క్లస్టర్ల వారీగా ఇచ్చిన లక్ష్యాలను మరో 15 రోజులలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లక్ష్యసాధనలో ప్రగతి కనపడేంతవరకు ప్రతిరోజు సమీక్షిస్తానన్నారు. వేతన దారులకు వంద రోజుల పనిదినాలు కల్పించడం, లేబర్ బడ్జెట్ ను మెరుగుపరచడం, నిర్దేశించిన పది అంశాల్లో వెనుకబడి జిల్లాను దిగువ స్థానంలో ఉంచడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత సిబ్బందిని ప్రశ్నించారు. నిర్లక్ష్యాన్ని విడనాడి పనితీరు మెరుగుపరుచుకుని మనసు పెట్టి అంకితభావంతో పనిచేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ ఆదేశించారు. సెప్టెంబర్ రెండో వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉంటుందని… ఈ మేరకు క్షేత్రస్థాయి సిబ్బంది దృక్పధాన్ని మార్చుకొని మరో 15 రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలో మెరుగైన ర్యాంకింగ్ తీసుకువచ్చి టాప్ 5లో ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్లాంటేషన్ కు సంబంధించి ఫిట్టింగ్, ప్లాంటేషన్ ఏకకాలంలో జరగాలన్నారు. ప్రజలకు, రైతులకు ఉపయోగపడే పనులు చేస్తే ఆత్మ సంతృప్తి ఉంటుందని ఆమె తెలిపారు. ఉపాధి ఎపీడీలు ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తూ పనుల వేగవంతానికి కృషి చేయాలన్నారు. ఓడిఎఫ్ ప్లస్ సర్వే కూడా అన్ని జిల్లాలు పూర్తి చేశాయని సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సర్వే పూర్తి చేయించి మెరుగైన స్థితికి తీసుకురావాలని ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక