ఆంధ్రప్రదేశ్
మొక్కల కుంభకోణం,కుక్కల సమస్యపై చర్య తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రాలు ఇచ్చిన పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం

ఏపీ టుడే న్యూస్,బ్యూరో కర్నూల్ సిటీ
నగరంలో ప్రధాన తారు రోడ్లపై ఇనుప రాడ్లతో సిమెంట్ బెడ్డు వేసి..దానికిరువైపులా ఆర్ సి సి గోడలు నిర్మించి మధ్యలో మొక్కలు నాటేందుకు నాసిరకం మట్టి వేసి..మొక్కలకు నేలకు సంబంధం లేకుండా డివైడర్లు నిర్మిస్తూ కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. మొక్కల పేరుతో జరుగుతున్న నిర్మాణాల్లో కోటి రూపాయలకు పైగా కుంభకోణం జరిగిందని.. దీనిపై విచారణ జరిపించి ప్రజాధనాన్ని కాపాడాలని ఈరోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎం నాగరాజు, సీవీ వర్మ, సి మద్దిలేటి ల ప్రతినిధి బృందం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు కొండారెడ్డి బురుజు నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ గేట్ వరకు, సి క్యాంపు నుండి నంద్యాల చెక్పోస్ట్ వరకు, ఆర్ సి సి డివైడర్లు నిర్మించి పలు సందర్భాల్లో నాసిరకం మట్టిని వేయడం తొలగించడం, మళ్లీ వేయడం..అందులో వేసిన ఖరీదైన మొక్కలు 90 శాతం బ్రతక లేదు. ఇదే సందర్భంలో రంగులు వేయడం సిమెంటు ప్లాస్టింగ్ లాంటి పనుల్లో కోటి రూపాయలకు పైగా కుంభకోణం జరిగింది. మేమేమీ తక్కువ కాదన్నట్లు రహదారుల శాఖ వారు వై జంక్షన్ నుండి పెద్దపాడు వరకు నేలకు మొక్కలకు సంబంధం లేని పద్ధతిలో అవసరానికి మించి ట్రాఫిక్ డివైడర్లు నిర్మిస్తూ పనికిరాని రాళ్ల మట్టిని వేస్తున్నారు. ఇదే ప్రాంతంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనుల్లో నాణ్యత ఆలోపించింది. ఈ లోపాలపై సంబంధిత రహదారుల శాఖ ఇంజనీర్ కు స్పందించలేదు. ఈ రెండు ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలపై విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని కోరారు. అలాగే నగరంలో కుక్కల బెడద పెరిగిపోయిందని, పిల్లలు వృద్దులు బయటికి రావడానికి భయపడుతున్నారు. రోడ్లపై వెళ్లే ద్విచక్ర వాహనదారుల వెంటపడుతూ ప్రజలను గాయపరుస్తున్నాయి. కుక్కలను బంధించి పునర్వాసం కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో వదలాలని కోరారు. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక