ఆంధ్రప్రదేశ్
వాగులు, వంకల వద్ద గట్టిగా నిఘా పెట్టండి.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
పారిశుధ్య చర్యలు ముమ్మరం చేసి ఆరోగ్యవంత జిల్లాగా తీర్చిదిద్దండి.
పంట నష్టం పై ప్రాథమిక నివేదికలు ఇవ్వండి.
భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి బ్రిడ్జిలపై ప్రవహిస్తున్న నీటికిరువైపులా నిరంతర నిఘా ఉంచి రాకపోకలకు అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా భారీ వర్షాలు, పిజిఆర్ఎస్, సంక్షేమ హాస్టళ్ల పనితీరు, ఈ-పంట, పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి సరఫరా తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో బ్రిడ్జిలపై పారుతున్న నీటిలోకి రాకపోకలు నిలుపుదల చేసి ఇరువైపులా నిరంతర నిఘా ఉండాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాలలోని అన్ని మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ, అక్కడి ప్రజానీకానికి సంబంధిత అధికారులు అందుబాటులో వుండి అత్యవసర సేవలు అందించాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలు, పండ్ల తోటలు, పశు నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదికలు అందజేయాలని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఇవ్వాలని అంకెల గారిడి ఇస్తే తాను ఒప్పుకోనని స్పష్టం చేశారు. జిల్లాలో ఇ-పంట నమోదు నత్త నడకగా నడుస్తోందని ఇప్పటికే పూర్తయింటే ప్రయోజనకరంగా ఉండేదని, నిర్ణీత గడువులోగానైనా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో 27,203 మట్టి మిద్దెలు ఉన్నాయని, వర్షాల వల్ల పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న గృహాల నివేదికలు ఇవ్వాలని పంచాయతీ అధికారిని ఆదేశించారు. జిల్లాలో పారిశుద్ధ్య పరిస్థితులు అద్వాన స్థితిలో ఉన్నాయని వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేసి ఆరోగ్య జిల్లాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉండి వేంపెంట గ్రామంలో 30 డయేరియా కేసులు నమోదయ్యాయన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు క్షేత్రస్థాయిలో అద్వాన పరిస్థితిలో పనిచేస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకరి మీద ఒకరు చెప్పుకోకుండా సమన్వయంతో పనిచేసి డయేరియాను నియంత్రణలోకి తెస్తూ ఇకపై ఏ ఒక్క కేసు నమోదైన ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
జిల్లాలో ఉన్న 142 సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహార పదార్థాలు ఇవ్వడం లేదని ఆదివారం జరిగిన సంఘటన గుర్తు చేస్తూ ఇకపై ఏ హాస్టల్లోనైనా ప్రభుత్వ మెనూ ప్రకారం ఇవ్వకపోతే తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సంబంధిత హాస్టళ్లను ఆర్డీవోలు, తాసిల్దారులు, స్పెషల్ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ వాస్తవ నివేదికలను ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎ. పద్మజ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక