ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ రూఫ్ టాప్ ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ప్రధానమంత్రి సూర్య యోజన పథకం కింద గృహ వినియోగ దారులకు సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్ ల ఏర్పాటు
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద గృహ వినియోగ దారులకు సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా విజ్ఞప్తి చేశారు.
బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ప్రధానమంత్రి సూర్యకర్ యోజన పథకం అమలుపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ వినియోగ దారులు తమ ఇళ్ళ పై కప్పుపై సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చన్నారు.. ఒక కిలో వాట్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు వంద చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందన్నారు.. ఈ యూనిట్ ద్వారా నెలకు 120 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు..ఇందు కోసం 60 నుండి 70 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, ఇందులో సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ కింద 30 వేల రూపాయలు సబ్సిడీ లభిస్తుందని కలెక్టర్ తెలిపారు..వెయ్యి రూపాయలు బిల్లు వచ్చే వారికి సోలార్ ఏర్పాటు తర్వాత కేవలం రూ.338లు బిల్లు మాత్రమే వస్తుందన్నారు.. అలాగే 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ గ్రూప్ టాప్ ను 1.30 లక్షల నుండి 1.40 లక్షల వరకు ఖర్చు తో 200 చదరపు అడుగుల స్థలం లో ఏర్పాటు చేసుకుంటే 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, దీనికి రూ.60 వేల సబ్సిడీ లభిస్తుందన్నారు..3 కిలోవాట్ల సామర్థ్యం, ఆపైన రూ.78 వేలు సబ్సిడీ వస్తుందని కలెక్టర్ తెలిపారు..ఈ పథకం కింద బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు పొందే అవకాశం కూడా ఉందన్నారు. ఈ పథకాన్ని జిల్లా లోని గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు www.pmsuryaghar.gov.in/APSPDCL వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు..సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వినియోగదారులు తమ ఇళ్లకు వినియోగించుకోగా, ఇంకా మిగిలితే, దానిని విద్యుత్ శాఖ కొనుగోలు చేసే వెసులుబాటు కూడా ఉందని కలెక్టర్ తెలిపారు..
పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గృహ వినియోగ దారులు ప్రధానమంత్రి సూర్య యోజన పథకాన్ని వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఎన్టీపీసీ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ రూఫ్ టాప్ ల ఏర్పాటుపై కూడా దృష్టి పెట్టాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై వీటిని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..
జిల్లాలో మోడల్ సోలార్ గ్రామాల ఏర్పాటుకు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. వెల్దుర్తి, ఉల్చాల,పంచలింగాల, గార్గేయపురం, పర్ల, సి.బెళగల్ మండలాలను మోడల్ సోలార్ గ్రామాలుగా ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..
సమావేశంలో నెడ్ క్యాప్ డెవలప్మెంట్ అధికారి వీరేంద్రబాబు, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉమాపతి, ఇంఛార్జి మున్సిపల్ కమీషనర్ రామలింగేశ్వర్, ఎల్డిఎం రామచంద్రరావు, డిపిఓ నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక