ఆంధ్రప్రదేశ్
టిటిడి లో పురోహితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా :- బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి

తిరుపతి జిల్లా
తిరుపతి నియోజకవర్గం
తిరుపతి నగరంలోని తన నివాసంలో తనను కలిసిన
టిటిడి లో పురోహితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…
బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి
తిరుమలలోని కల్యాణ వేదికలో పనిచేస్తున్న పురోహితులు శుక్రవారం బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డిని తన స్వగృహంలో కలిసి శాలువతో సత్కరించి సుదీర్ఘ కాలంగా బ్రాహ్మణులుగా తిరుమల కళ్యాణ వేదికలో ఎదుర్కొంటున్న కష్టాలను ఎన్డిఏ ప్రభుత్వంలో చొరవ తీసుకొని పరిష్కరించాలని భువన్ కుమార్ రెడ్డి ద్వారా పురోహిత సంఘం సభ్యులు విన్నవించారు..
ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో గత 20 సంవత్సరాలుగా పౌరోహిత్యాన్ని వృత్తిగా నమ్ముకొని తరతరాలుగా జీవనం కొనసాగిస్తున్న సుమారు 110 మంది కళ్యాణ వేదిక పురోహితులు చాలీచాలని జీతాలతో ఎదుర్కొంటున్న సమస్యలను నూతన ఎన్డీఏ ప్రభుత్వంలో స్థానిక తిరుపతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పురోహితుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి తప్పక చేస్తానన్నారు!
తిరుమల కళ్యాణ వేదికలో పనిచేస్తున్న వారిని గత ప్రభుత్వంలోని అధికారులు అధికార పార్టీ నాయకులు బలవంతంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్ లో విలీనం చేసి సీనియారిటీని పక్కనపెట్టి అన్ని శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను వేధించడం జరిగిందని వారందరికీ న్యాయం జరిగేలా చూస్తానన్నారు
కళ్యాణ వేదికలో పనిచేస్తున్న అర్చకులు కొన్ని సందర్భాలలో అనారోగ్యం పాలైతే కనీసం టీటీడీ రెఫెరల్ ఆసుపత్రులలో కూడా వైద్యం అందించకపోవడం శోచనీయమన్నారు
టిటిడిలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా త్వరలో నూతనంగా బాధ్యతలు తీసుకోబోతున్న ఈవో గారికి నేరుగా కలిసి విన్నవిస్తానని అన్నారు
కళ్యాణ వేదిక పురోహితులకు హెల్త్ కార్డు,గుర్తింపు కార్డు లడ్డు కార్డు అందేలా చూస్తానని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్ లో చేరకుండా కోర్టుని ఆశ్రయించిన వారికి సీనియార్టీ ప్రకారం జీతాలు పెంచేలా తన వంతు కృషి చేస్తానని నవీన్ హామీ ఇచ్చారు…
టిటిడి డిప్యూటేషన్ అధికారులు పురోహితులను ఎన్నోరకాలుగా మనస్తాపానికి గురి చేశారని వారిని భయపెట్టేవారని పురోహితులు ఎవరికీ చెప్పుకోలేక మనోవేదనతో అనారోగ్యం పాలై మెడికల్ కార్డు లేకపోవటతో వలన ఇటీవల వైద్య ఖర్చులు భరించలేక 5,.6 గురు సభ్యులు మరణించి వారి కుటుంబాలు వీధిన పడ్డాయని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు..
ఎన్డీఏ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తానన్నారు
బిజెపి నాయకులను బట్టి శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక