ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు …. కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
* విఘ్నాలు తొలిగి విజయాలు చేకూరాలని ఆకాంక్ష.
* వినాయక చవితి వేడుకలు, గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు
ప్రశాంతంగా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి.
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మరియు మీడియా మిత్రులకు, వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని.. అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.
వినాయక చవితి వేడుకలు, గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా… ఆనందంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అవాంఛనీయ ఘటనలకు, అపశృతులకు తావులేకుండా మరియు ప్రజలకు అసౌకర్యం కల్గకుండా జరుపుకోవాలని సూచించారు.
జిల్లాలో ఉన్న వినాయక మండప నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, పోలీసు వారి సలహాలు, సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, వినాయక విగ్రహా మండపాలకు వాహనాలు దూరంగా నిలిపే విధంగా చూసుకోవాలన్నారు.
• విద్యత్తు సరఫరాకు, వాహానాల రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా మంటపాలు ఏర్పాటు చేయవద్దన్నారు.
• పాఠశాలలు, ప్రార్ధనా మందిరాలు, ఆసుపత్రులకు ఇబ్బంది కలిగించేలా లౌడ్ స్పీకర్లు పెట్టరాదు.
• రాత్రి 10 గంటల తర్వాత స్పీకర్లు, మైకులు ఆపి వేసే విధంగా విగ్రహా నిర్వహకులు చూసుకోవాలి.
• 24 గంటలు విగ్రహాల వద్ద కాపాలా, పర్యవేక్షించుకునే బాధ్యత మండపం నిర్వహకులదేనని,
అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే వెంటనే సంబంధిత స్ధానిక పోలీసు అధికారులకు లేదా డయల్ 100 పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని ఈ సంధర్బంగా జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ తెలిపారు.
మత సామరస్యానికి కర్నూలు జిల్లా ప్రతీక అని, కుల, మత విభేదాలు లేకుండా ప్రజలందరూ సోదర భావంతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకునేందుకు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యలు, నిర్వహాకులు, మేధావులు, మత పెద్దలు, రాజకీయ పార్టీలు, యువత, మీడియా తమ వంతు సహాయ సహాకారాలు అందించాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక