Connect with us

ఆంధ్రప్రదేశ్

ప్రతి ఒక్కరికి సమాచార హక్కుచట్టంపై అవగాహన కలిగి ఉండాలి

Published

on

ప్రతి ఒక్కరికి సమాచార హక్కుచట్టంపై అవగాహన కలిగి ఉండాలి
– ఫోరం ఫర్ ఆర్.టి.ఐ జాతీయ కార్యదర్శి అజయ్ ప్రసన్నకుమార్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నడిమింటి చంద్రకళ రెడ్డి పిలుపు
– తిరుపతిలో ఫోరం ఫర్ ఆర్టిఐ జోనల్ కార్యాలయం ప్రారంభం
– ప్రారంభోత్సవ కార్యక్రమానికి- ముఖ్య అతిథులుగా హాజరైన అజయ్ ప్రసన్నకుమార్, నడిమింటి చంద్రకళా రెడ్డి

తిరుపతి , జూన్ 9 ( తిరుపతి ప్రతినిధి ఎన్ చంద్రకళా రెడ్డి అంతిమ తీర్పు): రాష్ట్రంలోని యువతీ యువకులకు వయోవృద్ధులకు మహిళలకు పురుషులకు అన్ని రాజకీయ పార్టీలకు బాధితులకు ప్రతి ఒక్కరికి సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ కార్యదర్శి అజయ్ ప్రసన్నకుమార్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నడిమింటి చంద్రకళా రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలో ఆదివారం ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జోనల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అజయ్ ప్రసన్నకుమార్ నడిమింటి చంద్ర కళా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో చాలామందికి సమాచార హక్కు చట్టం అంటే తెలియదు అన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరి కి అవగాహన ఉండాలని ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఫోరం ఫర్ ఆర్టీఐ జోనల్ కార్యాలయాలు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. దీనిలో భాగంగానే ఆదివారం తిరుపతిలో ఫోరమ్ ఆర్టిఐ జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. తద్వారా ప్రతి ఒక్కరికి సమాచార హక్కు చట్టాన్ని గురించి తెలుసుకునేందుకు మరింత సులభతరం గా ఉంటుందన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నడిమింటి చంద్రకళా రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా యువత యువకులు మహిళలు బాధితులు తెలుసుకోవాలని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఫోరం ఫర్ ఆర్టీఐ జోనల్ కార్యాలయాలు ప్రారంభించి రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు యువతీ యువకులకు మహిళలకు వయా వృద్ధులకు పురుషులకు ప్రధానంగా బాధితులకు సమాచార హక్కు చట్టాన్ని గురించి తెలియజేయడం జరుగుతుందన్నారు. సమాచార హక్కు చట్టంపై అసోసియేషన్ తరపున ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సభలు సమావేశాలు ఏర్పాటు బాధితులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కొంతమంది బాధితులు ప్రభుత్వ రంగాల నుంచి సమాచారాన్ని సేకరించడంలో నానా ఇబ్బందులు పడుతున్నారని, అసోసియేషన్ తరపున ఇలాంటి జోనల్ కార్యాలయాలను ప్రారంభించడం ద్వారా బాధితులకు సమాచార హక్కు చట్టాన్ని గురించి తెలియజేయడంతో పాటు వారి సమస్యలను అసోసియేషన్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంతేకాకుండా సమాచార హక్కు చట్టానికి సంబంధించి బాధితుల సమస్యలను రాష్ట్ర సమాచార కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని తెలియజేశారు. బాధితులు సరైన పద్ధతిలో ఫిర్యాదులు చేయకపోవడంతో వారికి రావాల్సిన సమాచారం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా సంవత్సరాల తరబడి ఆ సమాచారం కోసం వేచి ఉండి చివరికి వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారుతున్నాయని బాధపడ్డారు. అవసరమైన ప్రతి ఒక్కరూ సమాచారాన్ని సరైన పద్ధతిలో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి నుంచి సరైన సమాచారాన్ని సేకరించే విధంగా ఫోరమ్ ఫర్ ఆర్టీఐ అసోసియేషన్ చేస్తున్న నిరంతర కృషిని ఆమె గుర్తు చేశారు. అంతేకాకుండా బాధ్యతలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందిస్తూ అవసరమైతే ప్రభుత్వ అధికారులపై కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తున్న విషయాన్ని తెలియజేశారు. ఇందులో భాగంగా బాధితులకు మరింత న్యాయం చేసేందుకు అసోసియేషన్ను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేస్తున్నామని ఇందులో భాగంగానే దేశ రాష్ట్రవ్యాప్తంగా జోనల్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బాధితులకు ప్రతి ఒక్కరు అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరించుకునే దిశగా అసోసియేషన్ ప్రతినిధి బృందం ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టిఐ తిరుపతి జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ జిల్లా సెక్రెటరీ ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నిర్మలాదేవి తిరుపతి సిటీ సెక్రెటరీ మలిరెడ్డి తిరుపతి అధ్యక్షులు ఆవుల సుబ్బు తిరుపతి మహిళా అధ్యక్షురాలు పుష్పలత తిరుపతి సిటీ మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మి తిరుపతి సిటీ మహిళా విభాగం లీల జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు గుణ జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్ జిల్లా జాయింట్ సెక్రెటరీ వెంకటేష్ కిరణ్ ఆంజనేయులు శివ శశికళ, ఫోరం ఆర్టిఐ ప్రతినిధి బృందం సభ్యులు బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580209
Total Users : 47893