ఆంధ్రప్రదేశ్
వంద రోజుల్లో ప్రజలకు అందించిన పాలన నారా చంద్రబాబు నాయుడు బేస్. ఇంటింటా ప్రచారం చేసిన టిడిపి 11 వార్డ్ చాంద్ బాడ మాజీ కౌన్సిలర్ ఎస్ ఎం డి హనీఫ్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఆధ్వర్యంలో రాష్ట్రంలో 100 రోజుల ప్రజాపాలన చాలా బేస్ గా నడుస్తోందని నంద్యాల పట్టణంలోని టిడిపి 11 వార్డ్ మాజీ కౌన్సిలర్ ఎస్ఎండీ హనీఫ్ అన్నారు. 11 వార్డులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు కావలసిన ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న ఇంత మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నాయకులుతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లిన టిడిపి 11వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎస్ఎండీ హనీఫ్ 100 రోజుల్లో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల నివేదికను ప్రజలకు అందించారు.ఈ సందర్భంగా టిడిపి 11 వార్డ్ మాజీ కౌన్సిలర్ ఎస్ఎండి హనీఫ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, గత 5 ఏళ్లలో కనిపించని మార్పు ఈ వంద రోజుల్లోనే ప్రజలకు కనిపిస్తోందన్నారు.మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రశాంతంగా జీవించడం అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతివర్గానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కిందని అన్నారు .సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తొలి 5 సంతకాలను ఐదు ముఖ్యమైన అంశాలపై పెట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై పెట్టి 16,437 ఉపాధ్యాయ నియామకాలకు పచ్చ జెండా ఊపారన్నారు.గతంలో ఉన్న 3 వేల పింఛనును వృద్ధులకు 4 వేలు, దివ్యాంగులకు 6 వేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ప్రతి నెలా 1వ తేదీనే పింఛను అందిస్తూ వారిని ఆదుకుంటున్నారని అన్నారు. వైసిపి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేస్తే చంద్రబాబు ఒకేసారి 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించి 5 రూపాయలకే మధ్య పేద తరగతి వారికి పేదలకుకడుపునిండా అన్నం పెడుతున్నారని అన్నారు. మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ ఎం డి ఫరూక్ కూడా నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కారం చూపుతున్నారని, విజయవాడ వరదల నేపథ్యంలో మంత్రి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసునన్నారు. ఎక్కడా విశ్రాంతి అన్నది లేకుండా పనిచేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక