ఆంధ్రప్రదేశ్
రైతుల అప్పులు రద్దు చేయాలని, జిల్లాలో మెట్ట భూములన్నిటికీ ఎత్తిపోతల ద్వారాసాగునీరు ఇవ్వాలని కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి ని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.

ఏపీ టుడే న్యూస్,
నంద్యాల జిల్లా,
నంద్యాల
నంద్యాల జిల్లాలో గత సంవత్సరంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి .సకాలంలో వర్షాలు రాక అతివృష్టి, అనావృష్టి వల్ల సాగుచేసిన మొక్కజొన్న ,మినుములు, మిరప ,పండ్లతోటలు ఇతర అనేక పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా కట్టాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో అన్నదాతలు ఉన్నారని ఇప్పటికే జిల్లాలో మండల తాసిల్దార్ గారి కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించిందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ. రాజశేఖర్, జిల్లా నాయకులు ఏ .సురేష్, శ్రీనివాస రెడ్డి ,సుధాకర్ రెడ్డి, నాగరత్నం ,రాజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. 2023లో ఖరీఫ్లో ఆరు మండలాలను కరువు మండలాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. కేంద్ర కరువు బృందం జిల్లాలో పర్యటించిన కరువు నివారణ చర్యలకు ప్రత్యేకమైన నిధులు కేటాయింపులు జరగలేదు. అందువల్ల రైతులను ఆదుకోవడానికి 2023 ఖరీఫ్, రబీలో సాగుచేసిన పంటలకు ఇన్సూరెన్స్ ప్రకటించి రైతుల ఖాతాలకు జమ చేసి రైతులను ఆదుకోవాలని, ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు వెంటనే అమలు చేసి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20 వేల రూపాయలు ఇవ్వాలని, శ్రీశైలం ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో నిర్మించి ఇతర జిల్లాలకు ,మద్రాసు నగరానికి తాగునీరు అందిస్తున్నప్పటికిని ఈ జిల్లాలో రైతులు సాగునీటి వనరులు లేక ప్రతి సంవత్సరం ఆకాశం వైపు చూడడం జరుగుతుందని తెలిపారు. సిద్దాపురం చెరువు పై ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి శ్రీపతిరావుపేట, ఇంద్రేశ్వరం ,వడ్ల రామాపురం, కురుకుంద ,కొత్తపల్లే చెరువులకు నీళ్లు నింపాలని, సంగమేశ్వరం, జడ్డువారు పల్లె దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ పై ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి కొత్తపల్లి మండలంలోని మెట్ట భూములన్నిటికీ సాగు మీరు ఇవ్వాలని, బేతంచెర్ల మండలం గూటుల్లె చెరువును రిజర్వాయర రిజర్వాయరుగమార్చి హంద్రీనీవా ద్వారా నీళ్లు నింపాలని తద్వారా ఎనిమిది గ్రామాలకు సాగునీరు, త్రాగునీరు పుష్కలంగా ఉంటుందన్నారు. పాములపాడు మండలంలో ఎస్ ఆర్ ఎం సి పై జూటూరు పాములపాడు దగ్గర ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి పాములపాడు, రుద్రవరం, జూటూరు ,మిట్ట కందల గ్రామాల మెట్ట భూములకు సాగును ఇవ్వాలని, వెలుగోడు రిజర్వాయర్ పై ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి వన్ ఆర్ వన్ ఎల్ తూములతో పాటు వెలుగోడు, గుంతకందాల, వేంపెంట, బానికచర్ల గ్రామాల మెట్టు భూములకు సాగునీరు ఇచ్చి రైతులు వ్యవసాయ కూలీల జీవనోపాధి కల్పించాలని రైతులు పోరాటాల ద్వారా సాధించుకున్న వ్యవసాయానికి ఉచిత కరెంటు నుకొనసాగించాలని, జీవో 22ను రద్దు చేయాలని అన్ని రకాల విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, రసాయనికపు ఎరువుల సబ్సిడీకి అందించాలని, తుఫాను, భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంటలన్నిటికీ ఎకరాకు 30000వేలరూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని 60 సంవత్సరాలు దాటిన చిన్న, సన్నకారు రైతులందరికీ నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను కౌలు రైతులందరికీ వర్తింపజేయాలని, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు నిర్మిస్తున్న హైవే రోడ్డు, సోలార్ ప్రాజెక్టులలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 చట్ట ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రైవేటు మార్కెట్ ధర పైన నాలుగు రెట్లు అదనంగా నష్టపరిహారం ఇవ్వాలని, తద్వారా నంద్యాల జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారిని కోరడం జరిగింది.
ఏ రాజశేఖర్ జిల్లా కార్యదర్శి
ఏపీ రైతు సంఘం.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక