ఆంధ్రప్రదేశ్
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన :- సిహెచ్ఓ. రామ్మోహన్ రెడ్డి

ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా-
సిరివెళ్ళ:- స్థానిక మండల పరిధిలోని- గురువారం నాడు- ఖాదర బాధరా గ్రామంలో వైద్యాధికారిని దివ్య మరియు డాక్టర్ .ముఖేష్ గారి సూచన మేరకు సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి
మరియు మలేరియా సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి ఆరోగ్య సిబ్బంది ఆశ కార్యకర్తలతో కలిసి గ్రామములో ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమలు నీటి నిలువలలో గుడ్లు పెట్టి లార్వా, ప్యూపాగా మారి వారానికి దోమగా తయారవుతాయని తెలిపారు. దోమలు అన్ని నీటి నిలువలలో గుడ్లు పెడతాయని గృహ అవసరాలకు వాడుకునే నీటి నిల్వలను వారానికి ఒకసారి ఫ్రైడే రోజు తొలగించి ఆరిన తర్వాత మళ్లీ నీళ్లు నింపుకోవాలని సూచించారు. సాధారణంగా ఒక దోమ సుమారు జీవిత కాలంలో పది సార్లు గుడ్లు పెడుతుందని ఒక్కొక్క దోమ 200 గుడ్లు పెడతాయనిఈ లెక్కన ఒక దోమ జీవిత కాలంలో200×10 అంటే 2000 దోమలను ఉత్పత్తి చేస్తుందని రెండువేల దోమలు తిరిగి 200 గుడ్లు పెడితే నాలుగు లక్షలు దోమలు తయారవుతాయని ఈ లెక్కన దోమల వ్యాప్తిని గుడ్డు మరియు లార్వా దశలలోనే నియంత్రించకపోతే దోమల పెరుగుదలను అరికట్ట లేమని తెలిపారు. గ్రామంలోని వీధుల్లో మురికి కాలువలను పరిశీలించి నీటిని నిలువ లేకుండా చూసుకోవాలని సూచించారు .సాయంత్రము ఫాగింగ్ స్ప్రే (పొగమందు)చేయిస్తున్నట్లు తెలిపారు. కాబట్టి జ్వరం వచ్చిన ప్రతిసారి మందులు వాడడం కన్నా జ్వరం రాకుండా ఉండటానికి మూలాలను గుర్తించాలని అంటే నీటి నిలువలను తీసివేయాలని మరియు లార్వా నివారణ మందులను నిలువ నీటిపై చెల్లించుకోవడం, నిలువ నీటిపై ఇసుక మరియు వేస్ట్ ఇంజన్ ఆయిల్ కలిపి చల్లించుకోవడం, దోమతెరలు వాడడం ,కిటికీలకు డోర్లకు మెస్సులు బిగించుకోవడం , ఫుల్ హాండ్స్ కాటన్ దుస్తులను ధరించడం, వేపాకు పొగ పెట్టుకోవడం, మస్కిటో రిఫలెంట్స్ వాడడం చేయాలన్నారు. మరియు జ్వరం వచ్చిన వెంటనే ఆరోగ్య సిబ్బందిచే గానీ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గాని రక్త పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలని తెలిపారు. మరియుపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మలేరియాను పూర్తిగా నివారించవచ్చని చికిత్స అందుబాటులో కలదని తెలిపారు.
గ్రామములో వైద్య శిబిరము నిర్వహించామని రక్త నమూనాలను సేకరించి పరీక్షించామని పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.
ఇన్ఫెక్టెడ్ దోమ కాటు వల్ల మాత్రమే మలేరియా, డెంగ్యూ చికెన్ గునియా లాంటి వ్యాధులు వ్యాపిస్తాయని రోగగ్రస్తుని కుట్టిన దోమ ఆరోగ్యవంతుని కుడితే వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు. కాబట్టి దోమల నియంత్రణకు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక