ఆంధ్రప్రదేశ్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించండి, ప్రజా సంఘాల నిరసన దీక్ష .

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జరుగుతున్న ఆందోళనలో రాష్ట్ర ప్రజానీకం కార్మికులు ఉద్యోగులందరూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించీ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.గురువారం నంద్యాల పట్టణం లోని తాసిల్దార్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షను ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టీ, రమేష్ కుమార్ పూలమాలలు వేసి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు అధ్యక్షులుగా రైతు సంఘం సీనియర్ నాయకులు సుబ్బరాయుడు అధ్యక్షత వహించారు. దీక్ష కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి రమేష్ కుమార్, రశేఖర్, సోమన్న, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు శంకర్ లు మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతికగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని ఎన్నికల ముందు విశాఖ ఉక్కుల ను ప్రైవేట్ పరం చేయమని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా స్పీడ్ గా విశాఖ ఉక్కు ను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నాలు వేగవంతం చేసిందని ఇప్పటికే అందులో పనిచేస్తున్నటువంటి 4,000వేల మంది కాంట్రాక్టు కార్మికులను రాత్రికి రాత్రికి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఇది అత్యంత దుర్మార్గంగా ఉందని 2,500 మందికి పైగా విఆర్ఎస్ ప్రకటించి ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తుందని, దీనికి తోడు మరో 500 మందికి పైగా ఉద్యోగులను డిప్టేషన్ పేరుతో వివిధ సంస్థలకు పంపించే ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే విశాఖ ఉక్కును కారు చౌకగా అమ్మేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే ఇక్కడున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ అడుగులకు మడుగులు వత్తుతూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడానికి మూగెద్దుల్లా తల ఊపుతున్నారని ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు.ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తాన్ని మోసం చేయడమేనని కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు కార్మికులు ప్రజలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో జరగబోయే ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతు సంఘం ఉపాధ్యక్షులు సురేష్, వీరన్న, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, నరసింహులు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు శంకర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు సిపిఐ రైతు సంఘం నాయకులు సిపిఎం న్యూ డెమోక్రసీ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక