ఆంధ్రప్రదేశ్
అకాల వర్షంతో నష్టపోయిన బాధిత రైతులు జిల్లా కలెక్టర్ కు వినతి

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో గత శనివారం తెల్లవారుజామున కురిసిన అకాల భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, తడిచిపోయిన మొక్కజొన్న ధాన్యపు గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం నంద్యాల కలెక్టర్ జి. రాజకుమారికి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి వినతి పత్రం అందించారు.
ఈ సందర్బంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి డాక్టర్. కాకరవాడ చిన్న వెంకటస్వామి మాట్లాడుతూ
నందికొట్కూరు నియోజకవర్గం లో శనివారం నాడు తెల్లవారుజామున కురిసినటువంటి అకాల భారీ వర్షం వల్ల మొక్కజొన్న పంట వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, పాములపాడు మండలంలోని వేంపెంట గ్రామానికి చెందిన రైతులు దాదాపు 300 ఎకరాల ఆరబెట్టిన మొక్కజొన్న దాన్యం నీటిలో తడిచిపోయి, కొట్టుకపోవడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా జూపాడు బంగ్లా, కొత్తపల్లి, మిడుతూరు, పగిడ్యాల, నందికొట్కూరు మండలాలలో రైతులు నష్టపోవడం జరిగిందని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు (50,000/-) యాబై రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, వర్షంలో తడిచినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ద్వారా కోరామని డా. కాకరవాడ చిన్న వెంకటస్వామి చెప్పారు.
ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్ రెడ్డి, ఈశ్వరయ్య, రఘునాథ్ రెడ్డి, శీలం నాగరాజు, భగవాన్ చౌదరి, జి. నాగిరెడ్డి, గుర్రప్ప, భాస్కర్, శివకుమార్, శేఖర్ తదితర బాధిత రైతులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక