ఆంధ్రప్రదేశ్
నంద్యాల జిల్లా ఆస్పత్రిలో పది రోజుల నుండి మోరాయించిన ఎక్స్రే మిషన్

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ఇబ్బంది పడుతున్న రోగులు.
పట్టించుకోని వైద్యశాఖ అధికారులు.
నంద్యాల జిల్లా ఆస్పత్రిలో ఎక్సరే మిషను పది రోజుల నుండి మురాయించడంతో రోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్సరే మిషన్ పనిచేయని విషయం జిల్లా వైద్య శాఖ అధికారులకు తెలిసిన కూడా ఏమాత్రం పట్టించుకోవడంలేదని రోగులు వాబోతున్నారు. పేరుకే జిల్లా ఆస్పత్రి కానీ జిల్లా ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి సదుపాయాలు లేవని రోగులు వాబోతున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందముగా నంద్యాల జిల్లా ఆసుపత్రి రోగులకు దర్శనమిస్తుందని పలువురు వాబోతున్నారు. జిల్లా ఆసుపత్రిలోనే స్కానింగ్ రూమ్ లో కూడా డాక్టర్ లేడని కేవలం నర్సులు మాత్రమే రూములో దర్శనమిస్తున్నారని వచ్చిన రోగులకు ఎటువంటి స్కానింగ్ చేయకుండా వెనక్కి పంపిస్తున్నారని రోగులు వాబోతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఎక్సరే మిషన్ పనిచేయకపోవడంతో ఈ ఎన్ టి, న్యూరో సర్జరీ, ఆర్తో కేసులు ,పెల్విస్ ,ఎల్ ఎస్ కేసులకు సంబంధించి రోగులకు ఎక్సరే తీయకపోవడంతో రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని రోగులు వాబోతున్నారు. ఎక్సరే మిషన్ పనిచేయని విషయం జిల్లా ఆసుపత్రిలో సూపర్డెంట్ కు వివరణ అడగడానికి వెళ్లగా సూపర్డెంట్ సెలవుల్లో ఉన్నారని, ఇన్చార్జి సూపర్డెంట్, సూపర్డెంట్ కార్యాలయంలో కనిపించని దాఖలాలు లేవని పలువురు వాబోతున్నారు. ఏది ఏమైనా నంద్యాల జిల్లా ఆసుపత్రిలో పది రోజుల నుండి పనిచేయని ఎక్సరే మిషన్ త్వరగా పని చేసే విధంగా వైద్య అధికారులు చర్యలు తీసుకొని రోగులకు మంచి వైద్యం అందించాలని రోగులు వాబోతున్నారు. అలాగే జిల్లా ఆస్పత్రిలో స్కానింగ్ వచ్చిన రోగులు కూడా ఇబ్బందులు పడకుండా స్కానింగ్ రూమ్ లో డాక్టర్ను నియమించి రోగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు రోగులు కోరుతున్నారు. నంద్యాల జిల్లా ఆస్పత్రిలో సమస్యలపై ఎన్ని రాతలు రాసిన అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయని అధికారులు మాత్రం ఏ మాత్రం చలనలేదని చెవుటోని ముందర శంఖం ఊదినట్లుగా ఉందని రోగుల నుండి వారి బంధువుల నుండి విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక నిగా ఉంచి రోగులకు మంచి వైద్యం అందించాలని రోగులు, వారి బంధువులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక