ఆంధ్రప్రదేశ్
చెంచు లక్ష్మి గూడెం రైతులకు విద్యుత్ సౌకర్యం

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్ అక్టోబర్ 21.
మహానంది సమీపంలోని తెలుగు గంగ బర్రెల బ్రిడ్జి వద్ద ఉన్న చెంచులక్ష్మి గూడెం రైతులకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ స్తంభాలను నెలకొల్పారు. 11 కెవి విద్యుత్తు లైను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసి అక్కడినుండి ఎల్ టి లైన్ ద్వారా 55 ఎకరాలకు సంబంధించిన చెంచుగూడెం రైతులకు పంటలను సాగు చేసుకోవడానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ మరియు విద్యుత్ శాఖ అధికారులు ఆదేశాల మేరకు చేస్తున్నట్లు ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయకుండా అక్కడ కాపలాగా అటవీ శాఖ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దాదాపు నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్ రాజకుమారి చెంచులక్ష్మి గూడేన్ని సందర్శించడంతోపాటు ఆర్వో ఎఫ్ ఆర్ లో సాగు చేస్తున్న పంట పొలాలను పరిశీలించి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని అప్పట్లో గూడెం వాసులకు హామీ ఇచ్చారు. అది నేడు కార్యరూపం దాలుస్తుంది. చెంచుగూడెం వాసులకు వారి నివాస ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలంటే ఐటీడీఏ అధికారులు అనుమతి తప్పనిసరి. కానీ నేటి వరకు కూడా ఐటిడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. ఎన్నోసార్లు చెంచుగూడెంలో ఐటీడీఏ ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు మరియు వ్యక్తులు పర్యటించారు. కానీ కనీసం వారి ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆలోచన కానీ అమలు చేద్దామని చిత్తశుద్ధి కానీ కనిపిస్తున్నట్లుగా లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకే చెంచు గూడేలను సందర్శిస్తున్నారు, కానీ వారికి కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఐటీడీఏ విఫలమైందని ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు ఫారెస్ట్ అధికారులు చెంచుగూడెం రైతులకు వారి నివాస ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేది లేదని ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల్లో విద్యుత్ సరఫరా సంబంధించి ఎలాంటి అనుమతులు ఫారెస్ట్ శాఖ నుండి లేవు అనేది వారి వాదన. మానవతా కోణంలో పట్టు విడుపు ధరణిలో నేడు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్బారావు వీఆర్వో చలమయ్య డిఆర్ఓ రాధాకృష్ణ గార్డ్ ప్రతాప్ తదితరులు పర్యవేక్షణలో పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక